visitors

Tuesday, May 9, 2017

వేయబోవని తలుపు - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గీతం

                

ఆకుండి వెంకటశాస్త్రిగారికి గురుపూజ జరిగిన సందర్భంలో సంగీతరావుగారు 1943 లో కాకినాడ వెళ్ళారు. అప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో పరిచయం ఏర్పడింది.  ఫ్రేజర్ పేట రినైసాన్స్ క్లబ్ లో వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  సంగీతరావుగారు కచేరీ కూడా చేసారు. ఆవిధంగా కృష్ణశాస్త్రిగారితో  ఏర్పడిన పరిచయం, కొేంతకాలం విరామం తరువాత  మద్రాసులో తిరిగి కొనసాగింది.  

దేవులపల్లిగారు  రాసిన   పూవులేరి తేవే చెలి, ప్రతి దినమూ నీ గుణకీర్తనము, వేయబోవని తలపు, మ్రోయింపకోయ్ మురళి, జయజయమహాంధ్ర జనయిత్రి, భ్రమించుముద్దు మోముతో, శివుడు తాండవమాడెను, చూచితివో లేదో చిన్ని కృష్ణుని సొబగు మొదలైన ఎన్నో రచనలను  సంగీతరావుగారు స్వరపరిచారు.  యోగాంబళ్ స్ట్రీట్, కమలాబాయ్ స్ట్రీట్ జంక్షన్ దగ్గర దేవులపల్లిగారి నివాసంలో ఆయనను తరచు కలుస్తూ ఉన్నప్పుడు తాను స్వరపరచిన గీతాలను ఆయనకు వినిపిస్తూ ఉండేవారు. సంగీతరావుగారి అమ్మాయి పద్మావతి తో ఈ భావగీతాలను పాడించి వినిపించేవారు. 

కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారు గొప్ప సంగీతవేత్త. హైదరాబాద్ ఆకాశవాణిలో మ్యూజిక్  కంపోజర్ గా పనిచేసారు. సంగీతరావుగారి అమ్మాయి పద్మావతికి మామగారు. 1985-86 సం. లో పద్మావతి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో అనేక లలితగీతాలను ఆలపించారు. సూర్యప్రకాశరావుగారి వాద్య నిర్వహణలో పాడిన దేవులపల్లివారి గీతాలలో వేయబోవని తలుపు గీతాన్ని ఇక్కడ వినండి.

 ఒక పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తరవాత ఆ రాగంలోని ఏదైనా కీర్తన, కృతి లేదా భావగీతం పాడడం అనేది పట్రాయని సీతారామశాస్త్రిగారి సంప్రదాయం.  

A raaga aalaapana preceding a keerthana or krithi is for exploring the whole gamut of the raaga. In the School of Patraayani Seetharama Shastry garu, it is achieved in a meaningful way through rendering a  padhyam followed by the keerthana or krithi. 

ఈ పాటని కూడా అదే పద్ధతి లో పాడారు పద్మావతి. 

కృష్ణశాస్త్రిగారి భావగీతాలన్నీ అమృతవీణ, మంగళకాహళి, కృష్ణపక్షము అనే సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. కృష్ణపక్షము లోని శారదశర్వరీఅనే ఖండికను ముందు పహాడీ రాగంలో పద్యంగా పాడారు. తరువాత  అమృతవీణ సంకలనంలోని కృష్ణాష్టమి శీర్షికలోని –
 “ వేయబోవని  తలుపు తీయమంటూ పిలుపు అనే గీతాన్ని పహడీ రాగంలో పాడారు.