visitors

Sunday, April 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఆరవ భాగం

11.04.2021 - ఆదివారం భాగం - 26:
అధ్యాయం 2  భాగం 25 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.

శ్వేత కపోతాలు

మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. 

ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. 



ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  

 
 
 


నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.


పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

1960ల తర్వాత ఎప్పుడో ఒక ఉగాది ఘంటసాల మాస్టారింట్లోనే జరిగింది. శ్రీయుతులు యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారు (జరుక్ శాస్త్రి) సాహితీలోకానికి చిరపరిచితులు. యామిజాలవారు మా నాన్నగారికి చిరకాల మిత్రులు. సాలూరుకు సమీపంలోని శివరామపురాగ్రహారం వారి స్వస్థలం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిదీ అదే ఊరు. పద్మనాభస్వామిగారు ఉద్యోగరీత్యా మద్రాస్ లో స్థిరపడ్డారు. పానగల్ పార్క్ వద్దనున్న శ్రీరామకృష్ణ మిషన్ శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూలు లో తెలుగు పండితులుగా పనిచేసేవారు. 

శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చెల్లెలు మల్లాది మంగతాయారుగారు కూడా అదే స్కూల్ లో మరో తెలుగు టీచర్ గా పనిచేసేవారు. మా చెల్లెళ్ళు, మాస్టారి ఆడపిల్లలు అందరూ యామిజాలవారికి, మంగతాయారుగారి విద్యార్ధినులే. మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి రమణమ్మకి పిహెచ్.డి. చెయ్యాలన్నంత అభిమానం తెలుగు భాష మీద కలగడానికి వీరిద్దరి వద్ద చేసిన శిష్యరికమే కారణమని  నేను అనుకుంటున్నాను. శారదా విద్యాలయలో శ్రీ పద్మనాభస్వామిగారు మాత్రమే మగవారు. మిగిలిన టీచర్లంతా హెడ్మాష్టర్ తో సహా అందరూ మహిళలే. 

యామిజాల వారు మొదట నెం.35, ఉస్మాన్ రోడ్ దగ్గర బజుల్లా రోడ్ కి అవతల తిలక్ స్ట్రీట్ లోను తరవాత  కోడంబాక్కం రైల్వేస్టేషన్ వెళ్ళేదారిలో రామకృష్ణ స్ట్రీట్ ముందుండే వివేకానందా స్ట్రీట్ మొగలో ఉన్న ఇంట్లో ఉండేవారు. యామిజాల వారు చాలా సన్నగా పొడుగ్గా వుండేవారు. మాట కూడా చాలా నెమ్మది. వినీ వినిపించకుండా వుండేది. యామిజాల మాస్టారి భార్య భానుమతి గారు(?) ముగ్గురో నలుగురో మగపిల్లలు. ఆడపిల్లలు లేకపోవడం వలన ఆడపిల్లలంటే ఆ దంపతులు మహా ముచ్చట పడేవారు. మహాశ్రోత్రీయ కుటుంబం. వారింటి పూజాగృహంలో రమణమహర్షి, కావ్యకంఠ గణపతిముని గార్ల చిత్రపటాలు వుండేవి. యామిజాల మాస్టారు మా ఇంటి ప్రక్కనుండే స్కూల్ కు నడచి వెళ్ళేవారు. ఖద్దర్ పంచెకట్టు, మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉండే జుబ్బా, దానికి ఒక్క పెన్ను మాత్రం పట్టేపాటి సన్నటి పొడుగు జేబు, భుజంపై కండువా - నిజంగా పూర్వకాలపు ఉపాధ్యాయుడికి ప్రతీకగా వుండేవారు. మాటా నెమ్మది, మనిషి చాలా సౌమ్యుడు. ఈయనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించే వ్యక్తి జరుక్ శాస్త్రి అనబడే జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు. పానగల్ పార్క్ కు ఉత్తరంవేపు యామిజాల వారైతే, దక్షిణం వేపు జలసూత్రం వారు. బహుశా, ఉస్మాన్ రోడ్ లో రామన్స్ కాఫీ పొడి కొట్టు, సలామ్ స్టోర్స్ వెనకవేపు వుండే ఇళ్ళలో వుండేవారనుకుంటాను. అక్కడే జి.ఎన్.స్వామిగారి కుటుంబమూ ఉండేది. టి.నగర్ బస్ స్టాండ్ నుంచి బయల్దేరిన బస్సులు ఆగే మొదటి బస్ స్టాప్ కూడా అక్కడే ఉండేది.

సాయంత్రం ఐదు ఆరు ప్రాంతాలలో  జలసూత్రంవారు, శ్రీరంగం నారాయణబాబుగారు, యామిజాలవారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, ఆరుద్రగారి వంటి కవిపుంగవులంతా పానగల్ పార్క్ ముందున్న సిమెంట్ చప్టాల మీద ఆసీనులై లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అందరూ సాహితీవేత్తలే కావడం వలన  ఎన్నో ఆసక్తికరమైన విషయలే చర్చించబడేవి. కీట్స్, కృష్ణశాస్త్రి, కిన్నెరసాని, కోడంబాక్కం అప్పలసరసలు, చర్చిల్ చుట్టలు, గిరీశం లెక్చెర్లు, యిలా ఎంతోమంది వారి మాటల్లో కనిపించి పలకరించేవారు. ఈ సాహితీవేత్తల మాటలను వినడానికనే కొంతమంది సాహితీ పిపాసులు శ్రోతలుగా అక్కడికి చేరేవారు. మా నాన్నగారికి కూడా మంచి సాహిత్యాభిలాషవుండడం వల్ల వీరందరితో మంచి సాన్నిహిత్యమే వుండేది. ఆయనకు అవకాశమున్నప్పుడల్లా వీరిని కలుసుకునేవారు. 

శ్రీరంగం నారాయణబాబు
వీరిలో నారాయణ బాబుగారి వేషధారణ మిగతావారికి భిన్నంగా వుండేది. మధ్యపాపిడి, టైట్ పైజమా షేర్వాణి, పొడుగాటి జుబ్బా, పైన వేస్ట్ కోట్.
'యామిజాల జాలమేమి
జాలమేమి యామిజాల'
అంటూ పద్మనాభస్వామిగారి గురించిన రైమ్ ఒకటి వినపడేది. ఆ మాటను ఎవరు ఎప్పుడు ఎందుకు ఉపయోగించారనే విషయం నాకు తెలియదు.

జలసూత్రంవారు మహాభారతాన్ని, యామిజాలవారు రామాయణాన్ని ఆంధ్రీకరిస్తున్న రోజులవి. ఆంధ్రప్రభ దిన పత్రికలో మహాభారతం, ఆంధ్రపత్రిక దినపత్రిక లో రామాయణం ధారావాహికగా ప్రచురించబడేవి. రామాయణ, మహాభారత గ్రంథాల పుస్తకరూప ఆవిష్కరణోత్సవాన్ని ఘంటసాల మాస్టారు చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మా నాన్నగారు కూడా ఇతోధికంగా తోడ్పడ్డారు. ఒక ఉగాదినాటి ఉదయం ఈ కృతిస్వీకారోత్సవం ఘంటసాల మాస్టారింటి హాలులో జరిగింది. ఆ కృతులభర్త ఘంటసాల మాస్టారేనని గుర్తు. ఖచ్చితంగా చెప్పలేను. మా నాన్నగారికి గుర్తుండి ఉండవచ్చు. ఆనాటి ఉత్సవానికి సర్వశ్రీ - దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, పాలగుమ్మి పద్మరాజుగారి వంటి కవులు ప్రత్యేకంగా విచ్చేసారు. ఆహ్వానితులందరికీ ముందుగా, పార్క్ ల్యాండ్స్ హోటల్ నుండి తెప్పించిన అల్పాహారం తో చిన్నపాటి విందు జరిగింది. తర్వాత, కవిసమ్మేళనంలో భాగంగా యామిజాల పద్మనాభస్వామిగారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు తాము ఆంధ్రీకరించిన  రామాయణ, మహాభారతాలనుండి కొన్ని ఘట్టాలను రసవత్తరంగా చదివి వినిపించారు. వక్తల ప్రసంగాల తర్వాత ఘంటసాల మాస్టారు ఈ ఇద్దరు కవులను సముచితరీతిని గౌరవించి సత్కరించారు.  

ఘంటసాల యామిజాల మధ్యలో జలసూత్రం దేవులపల్లి

ఆనాటి కార్యక్రమం ప్రముఖ కవుల రాకతో కళకళలాడింది. మాస్టారు, మా నాన్నగారు ఒక మంచి సత్కార్యంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందించారు.

మరికొన్నేళ్ళ తర్వాత, శ్రీ యామిజాల పద్మనాభస్వామిగారు శ్రీ తిరుపతి వేంకటేశ్వరుడిమీద వ్రాసిన 'భువన మోహన' పద్యాన్ని, 'శ్రీశేషశైలేశ శ్రితపారిజాతా' అనే పాటను ఘంటసాల మాస్టారు గ్రామఫోన్ రికార్డ్ గా రిలీజ్ చేసారు.



ఈ విధంగా ఘంటసాల మాస్టారు సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల పట్ల కూడా మంచి ఆసక్తికనపర్చేవారు.

ఇలాగే మరొకసారి, ఒక యోగాచార్యుడు మాస్టారి వద్దకు వచ్చి మద్రాస్ లో తన యోగాసనాల కార్యక్రమాన్ని సినీ ప్రముఖులందరి ఎదుటా ఏర్పాటు చేయమని కోరారు. సినీమాలోకంలో ఇలాటి యోగా కార్యక్రమాలు ఏమాత్రపు గుర్తింపు, మన్నన పొందుతాయో తెలియని సందిగ్దావస్థలోనే మాస్టారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరం  వృత్తి వ్యాపకాలతో తీవ్రమైన ఒత్తిళ్ళకు గురి అవుతున్న సినీ కళాకారులందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించి ప్రతీరోజు కొంతసేపు యోగాసానాలు వేస్తూంటే ఆరోగ్యానికి ఎంతైనా మంచిదని సందేశమిస్తూ ఘంటసాల మాస్టారు పరిశ్రమలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రికలను నేను, నరసింగరావు కలసి సినీ ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి ఇవ్వడం అందరినీ ఆహ్వానించాం. ఈ యోగాసానాల కార్యక్రమాన్ని ఘంటసాల మాస్టారు హబిబుల్లా రోడ్ లో వున్న రామారావు కళామండపంలో విజయవంతంగా నిర్వహించారు.

1970లకు ముందు మద్రాసులో తెలుగు సాంస్కృతిక సంఘాలు చాలా తక్కువ సంఖ్యలోనే వుండేవి. చెన్నపురి ఆంధ్ర మహాసభ, పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రా సోషల్ & కల్చురల్ క్లబ్ - ఇలా తెలుగు సంస్థలు వ్రేళ్ళమీదే లెఖ్ఖపెట్టవచ్చును. ఆయా సంస్థలు కూడా ఏడాదికి ఒకటో రెండో ఉగాది, సంక్రాంతి లాటి పర్వదినాలలో ఉత్సవాలు జరిపేవారు.

ఆరోజుల్లో మద్రాస్ లో తమిళ రంగస్థల నాటకాలకు వుండే మోజు, గిరాకీ సినీమాలకు కూడా వుండేది కాదు. తమిళ సినీ నటులు కూడా తమ పాప్యులారిటీని రంగస్థలం మీదనుండి పెంచుకున్నవారే. శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, చో, నాగేష్, తంగవేలు, ఎమ్.ఆర్.రాధ, సహస్రనామం, మనోరమ వంటి నటులంతా కూడా సినీమాలలో నటిస్తూనే  తరచూ నాటకాల ప్రదర్శనలిచ్చేవారు. లెజెండరీ డైరక్టర్ అయిన బాలచందర్, వృత్తిపరంగా గవర్నమెంట్ ఉద్యోగి అయినా రంగస్థల నాటకాల ద్వారా మంచి పేరు పొందారు.  టెలివిజన్ ఇళ్ళలోకి ప్రవేశించనంతకాలం తమిళనాట నాటకాలదే రాజ్యం.  తమిళ సీనీ నటీనటులతో పోలిస్తే తెలుగు రంగస్థల అభివృద్ధికి సినీనటులు చేయగలిగింది ఎంతో కొంత ఉన్నా చేసింది ఏమీ లేదనే చెప్పాలి. 

1965 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. వాటిలో అజరామర గీతాలుగా వన్నెకెక్కినవి - పెండ్యాలగారి 'కొండగాలి తిరిగింది'( ఉయ్యాల జంపాల); నమో భూతనాధా (సత్య హరిశ్చంద్ర); ఎస్.పి.కోదండపాణిగారి 'ఆలయాన వెలసిన, బొమ్మను చేసి ప్రాణం పోసి( దేవత).

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి పాండవ వనవాసం. మరొకటి సిఐడి.

ఈ చిత్రాల గురించి వచ్చేవారం....

కొసమెరుపు :
ఇది 1960 లకు ముందే జరిగినది.

ఘంటసాల మాస్టారు కచేరీలకోసం బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఎక్కువగా రైల్లోనే వెళ్ళేవారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ వెళ్ళి సాగనంపడనికి పెద్దబాబు, నేను, మాకు (తోడుగా బాబు వాళ్ళ అమ్మగారు - సావిత్రమ్మగారు) వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు ఇతర ఆర్కెష్ట్రాతో ముందే వెళ్ళిపోయేవారు. ఒకసారి హౌరామెయిల్ లో ప్రయాణం. ఆ రోజుల్లో  హౌరామెయిల్ రాత్రి 8.30 కు  4వ నెంబర్ ప్లాట్ఫారమ్ మీదనుండే బయల్దేరేది. మాస్టారు ఫస్ట్ క్లాసులో; ఆర్కెష్ట్రావారు స్లీపర్ కోచ్ లో ప్రయాణం. ఆరోజుల్లో రిజర్వడ్ కంపార్ట్మెంట్స్ లిమిటెడ్ గా ఉండేవి. అందుచేత వెళ్ళిన ప్రతీసారి రిజర్వేషన్ దొరక్కపోతే జనరల్ భోగీలోనే వెళ్ళవలసి వచ్చేది. మాస్టారు స్టేషన్ కు వెళ్ళగానే బృంద సభ్యులున్న చోటికి వెళ్ళి వారిని పలకరించి తన కంపార్ట్మెంట్ వద్దకు వచ్చేవారు. 

ఆ రోజు మాస్టారు కొంచెం ముందే స్టేషన్ కు చేరుకున్నారు. బయట పనుల ఒత్తిడివల్ల ఎప్పుడూ ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతోనే స్టేషన్ కు వెళ్ళడం జరిగేది. మేమూ వెంట పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఓ పది నిముషాలు ముందే చేరుకున్నాము. మాస్టారితోపాటూ మేమూ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాము. ఎదురు సీట్ లో ఎవరో ఇద్దరు యూరోపియన్స్ భార్యాభర్తలు కూర్చొనివున్నారు. మాకు అర్ధంకాని ఇంగ్లీషు స్లాంగ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంక ఒకటి రెండు నిముషాలలో రైలు బయల్దేరబోతున్నదనగా ఆ దొరసాని ఆ దొరగారిని గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టడం మొదలెట్టింది. Farewell kiss. ఆ దొర మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లున్నాడు. నాకూ, పెద్దబాబుకు బ్రహ్మాండమైన షాక్. కళ్ళు పెద్దవి చేసుకొని నోరెళ్ళబెట్టుకు చూస్తున్నాం. మాస్టారు మమ్మల్ని చూసి నవ్వుతు "టైమవుతోంది, ఇంక క్రిందకు దిగండని" అమ్మగారితో చెప్పి వెంటనే మమ్మల్ని క్రిందికి దింపించేసారు. ఆ సీన్ అక్కడితో కట్. అరవై ఏళ్ళ క్రితం బహిరంగ స్థలాలలో ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతికి విరుధ్ధం. విదేశీయులకు వారి కల్చర్ లో భాగం. వారు అశ్లీలంగా భావించరు. ఈనాడు మన యువతమీద విదేశీ నాగరికతా ప్రభావం  మెట్రోలలోని పబ్లిక్ పార్క్ ల్లో, సినీమా హాల్స్ లో వారి హావభావచేష్టల

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ముందుగా, వారం వారం పట్రాయని బ్లాగ్ ను దర్శిస్తూ 'నెం.35, ఉస్మాన్ రోడ్' ధారావాహికను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులందరికీ, రాబోయే శ్రీప్లవ నామసంవత్సర ఉగాది సందర్భంగా మా హృదయపూర్వక శుభాభివందనాలు.
      
ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరాది, తమిళుల నూతన సంవత్సరాది పక్క పక్క రోజుల్లోనే రావడం ఒక విశేషం. తమిళుల నూతన సంవత్సరం ఎప్పుడూ అదే ఏప్రిల్ 14వ తేదీనే జరుపుకుంటారు. చాంద్రమాన ఉగాది మాత్రం ఒక పదిహేను రోజులకి అటుయిటూగా ముందుగానే వస్తూంటుంది. 

ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రాబల్య ప్రభావం వలన తమిళనాడు లో నూతన సంవత్సర వేడుకలపై భిన్న భేదాభిప్రాయాలు తలఎత్తి ఒక వర్గంవారు తమిళుల కొత్త సంవత్సరం  'తై' (మన పుష్య మాసం) మాసంలో వచ్చే పొంగల్ (సంక్రాంతి) నుండే ప్రారంభం అవుతుందని దానినే అందరూ పాటించాలని హుకూం జారీచేస్తే మరొక వర్గం కాదు  'చిత్తిరై' (చైత్రం) (ఏప్రిల్ 14) మాస ప్రారంభమే నూతన సంవత్సరమని వాదిస్తుంది. మొత్తానికి ఏ వర్గం అధికారంలో వుంటే వారు నిర్ణయించినదే చట్టం.
'యథారాజా తథాప్రజా'!

మేము  చెన్నై అనబడే మెడ్రాస్ కు రావడమూ, మెడ్రాస్ పెరంబూర్ ప్రాంతంలో 'ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ'  (రైలు పెట్టెల నిర్మాణం) ఆనాటి ప్రధానమంత్రి  శ్రీ జవహర్లాల్ నెహ్రూగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఇంచుమించు కొద్ది మాసాల తేడాతో జరిగింది. మరో ఆరేడేళ్ళకు న్యూ ఆవడీ రోడ్ లో అణ్ణానగర్ వెస్ట్ సమీపంలో రైల్ కోచ్ ల ఫర్నిషింగ్ విభాగము నిర్మించడం జరిగింది. ఈ రెండు విభాగాలలో పనిచేసే వేలాది ఉద్యోగస్తులలో తెలుగువారి సంఖ్య కూడా అధికంగానే వుండేది. మేము మెడ్రాస్ వెళ్ళిన మొదటి మూడేళ్ళలోనే ఒక ఉగాదికి (అనే గుర్తు) ICF ఫ్యాక్టరీ లో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ జరిగింది. ఆ కచేరీకి నేను కూడా మా నాన్నగారివెంట వెళ్ళాను. నేను చూసిన, చూసి ఆనందించిన ఘంటసాలవారి మొట్టమొదటి సంగీత కచేరీ అదే. ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని తరచూ అనుభవించిన అదృష్టం నాకు చిన్నప్పటినుండే కలిగింది.

ఘంటసాల మాస్టారిది, మా నాన్నగారిది ఎప్పుడూ ఒకే డ్రెస్ కోడ్. వైట్ ఎండ్ వైట్. మా నాన్నగారు జుబ్బా, పైజమాలు ధరిస్తే, మాస్టారు జుబ్బా, పంచె లేదా తమిళుల అలవాటు ప్రకారం తెల్ల వేస్టి (లుంగీ)లతో శ్వేత కపోతాలవలె ప్రశాంతంగా కనపడేవారు.


శ్వేత కపోతాలు
మాస్టారు మాత్రం 1972-73 ప్రాంతాలలో కొన్నాళ్ళు కాషాయరంగు బట్టలు ధరించడం జరిగింది. అంతవరకూ ఎప్పుడూ స్వఛ్ఛమైన తెలుపు దుస్తులతోనే కనబడేవారు.

ఘంటసాల మాస్టారు కచేరీలకు బయల్దేరి వెళ్ళేప్పుడు సువాసనలు వెదజల్లే అత్తర్ కొంచెం ఉపయోగించేవారు. సావిత్రమ్మగారి ఆధీనంలో అరంగుళం సైజ్ లో రెండు మూడు బాటిల్స్ లో వివిధ పరిమళాల అత్తర్ లు వుండేవి.  ఆనాటి లెఖ్ఖకు అవి చాలా ఖరీదైనవే. ప్రత్యేకమైన విశేషదినాలలో మాత్రం ఉపయోగించేవారు. ఆ అత్తర్ లను ట్రిప్లికేన్ హైరోడ్ లో వుండే ఒక ముస్లీమ్ అత్తర్ సాహేబ్ అప్పుడప్పుడు మాస్టారింటికి వచ్చి ఈ అత్తర్ లను విక్రయించేవాడు. ఆ సాహేబ్ వీధి వాకిట్లో వుండగానే సెంట్ వాసనల గుబాళింపు సోకేది. తర్వాత ఎప్పుడో 1970 లలో వచ్చిన  'ఆలీబాబా 40 దొంగలు' సినీమాలో  విలన్ సత్యనారాయణ కోసం మాస్టారు పాడిన 'లేలో దిల్బహార్ అత్తర్' పాట విన్నప్పుడల్లా ఘంటసాల మాస్టారు ఉపయోగించిన అత్తర్ సువాసనలే గుర్తుకు వస్తాయి. మా నాన్నగారైతే 'ఆండవర్ జవ్వాదు' పొడిని ఉపయోగించేవారు. 

ఈ సుగంధ పరిమళాలు నా ముక్కుకు సోకుతుండగా  సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కారులో బయల్దేరి ICF కచేరీకి వెళ్ళాము. ఆనాటికి నాకు మద్రాస్ రోడ్ల తీరుతెన్నుల గురించి పెద్దగా తెలియదు. ఆనాటి కచేరీలో పాల్గొన్న ఇతర ఆర్కెష్ట్రావారి గురించి తెలియదు. అయితే మా నాన్నగారితో సహా మరో ఐదుగురారుగురు వాద్య బృందం వుంది. ICF ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే మాస్టారికి అక్కడి ప్రధాన ఉద్యోగులంతా ఘనస్వాగతం పలికి, ముందుగా, కోచ్ ఫ్యాక్టరీ లోపల అంతా తిప్పి చూపించారు. ఆ తర్వాత మాస్టారిని కచేరి వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండగ వాతావరణంతో అన్ని భాషలవారు హాజరయ్యారు. 

ముందుగానే చెప్పాను, ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ వినడం ఒక మధురానుభూతిని కలిగిస్తుందని. అందుకు కారణం, ఆయన ఒక గొప్ప పేరుపొందిన సినీమా గాయకుడు కావడంవల్ల కాదు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో లబ్దప్రతిష్టలైన మహాగాయనీగాయకులు, వాద్యకళాకారులు వున్నారు. వారి సంగీతం ఒక వర్గంవారినే ఆకర్షించి ఆనందింపజేస్తుంది. వారంతా పాడే రాగం, తానం, పల్లవులను లేదా ఖయాల్, తుమ్రీలు విని ఆనందించడానికి సంగీతంలోని ఔన్నత్యం, మాధుర్యం అనుభవించడానికి ఆ యా సంగీతం గురించి కొంతైనా తెలిసివుండాలి. అయితే ఏమీ తెలియకపోయినా బుర్రలు ఊపేస్తూ, ఆహా! ఓహో! వహ్వా! అంటూ హంగామా చేస్తూ ఇతరులను ఆకర్షించడానికి, తమ రసికతను నిరూపించుకోవడానికి కొంతమంది కుహానా రసికులు సంగీత సభలకు హాజరవుతూంటారు, అది వేరే విషయం అనుకోండి.   కానీ, ఘంటసాల వారి సంగీతం అలాకాదు. అన్ని వర్గాల శ్రోతలను సమానంగా అలరిస్తుంది. ఘంటసాలగారు లలితసంగీతానికి, లలితసంగీత కచేరీలకు ఆద్యుడు. 

ఘంటసాలవారు కచేరీలు చేయడం ఆరంభించిన తరువాతే సినీమా పాటల కచేరీలకు ఒక కొత్త గుర్తింపు, హుందాతనం ఏర్పడింది. వేదికలమీద సూటు బూట్లతో, చేతితో మైక్ పట్టుకొని వేదికను దున్నేస్తూ, ఒళ్ళంతా హూనమయేలా హడావుడి చేస్తూ పాటలు పాడే సంస్కృతి ఘంటసాల మాస్టారిది కాదు. తాను కచేరీ చేసే వేదికను సరస్వతీ నిలయంగా భావించి చాలా భక్తిశ్రధ్ధలతో తన కచేరీ ప్రారంభించేవారు. ఘంటసాలవారి సంగీత కచేరీ ఉగాది పచ్చడిలా షడ్రుచులతో, నవరసాలతో నిండివుండేది. శాస్త్రీయం, లలితం,  సినీమాగీతాలు, భక్తిగీతాలు అష్టపదులు, జానపదగీతాలు, పద్యాలు ఇలా అన్ని రకాల ప్రక్రియలతో బహుజనరంజకంగా పండిత పామరులను అలరిస్తూ తన సంగీత కచేరీలు జరిపేవారు. వేదికముందున్న శ్రోతలనాడిని, అభిరుచులను ముందు అర్ధం చేసుకొని అందుకు తగిన పాటలనే ఎంచుకునేవారు. ఘంటసాల మాస్టారు మధ్యలో కూర్చొనివుండగా, ఆయనకు ఇరుప్రక్కలా, వెనుకవేపు వాద్యబృందం అమరివుండేది. అందరూ వేదిక మీద కూర్చోనే శాస్త్రీయ సంగీత పధ్ధతిలో కచేరీ జరిగేది. 

ఘంటసాల వారు కొన్ని వందల, వేల సంఖ్యలో కచేరీలు జరిపివుంటారు. అయినా, ఆయన ఏనాడు  చేతిలోని పుస్తకం చూడకుండా పాడిందిలేదు. ఒకచేత పుస్తకం, ఒడిలో చేతిరుమాలు, మరొక చేతితో  ఒక చెవిని మూసుకొని పాడడం ఆయన ప్రత్యేకత. అలా ఎందుకు చెవిమూసుకొని పాడతారో కూడా తెలియకుండా చాలామంది ఔత్సాహిక గాయకులు ఘంటసాలవారిని అనుకరించడం చూస్తూంటాము. ఘంటసాల మాస్టారి కచేరీలలో పాడే పాటలన్నీ ఓ మూడు  పాకెట్ సైజు పుస్తకాలలో వుండేవి. కొన్ని పుస్తకాలలోని పాటలు వారి దస్తూరీతో ఉన్నవే. అవన్నీ బాగా పాతబడి జీర్ణావస్థకు చేరుకున్నాక తిరిగి అదే రంగులో, అదే సైజులో కొత్త పుస్తకాలను కొనడం చాలా కష్టమయేది. పానగల్ పార్క్ దగ్గరున్న యూనివర్శల్ స్టోర్స్ , టిప్ టాప్, అంటూ చాలా స్టేషనరీ షాపులు ఎక్కి దిగిన తర్వాత, మాస్టారు ఆశించే సైజు పుస్తకాలు లభ్యమయేవి. 
  

 
 
 


నేను ప్లస్ టూ ముగించినప్పటినుండి ఆ పాత పుస్తకాలలోని పాటలను  తిరిగి కొత్త పుస్తకాలలో రాయడం జరిగింది. అయినా, అలవాటు కొద్ది మాస్టారు  ఆ పాత పుస్తకాలనే కచేరీలకు పట్టుకువెళ్ళేవారు.

ఘంటసాల మాస్టారు తన కచేరీని ఎప్పుడూ వినాయకచవితి చిత్రంలోని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. ఆ పాట రావడానికి ముందు జరిగిన సంగీత కచేరీల గురించి నాకు తెలియదు. నేను హాజరయిన మొదటి కచేరీ ICF కచేరీయే.


పూర్యాధనశ్రీ రాగం (కర్ణాటక శైలిలో పంతువరాళి లేదా కామవర్ధని) లోని 'దినకరా' పాటను సశాస్త్రీయంగా రాగాలాపనతో, స్వరకల్పనలతో సుమారు పది పన్నెండు నిముషాలపాటు పాడేవారు.  వినాయకచవితి సినీమాలోనూ, గ్రామఫోన్ రికార్డ్ లోనూ లేని ఒక అనుపల్లవితో సహా ఆ పాటను పాడేవారు. సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఆ అనుపల్లవి ఏ కారణంచేతనో సినీమాలో లేదు. అందువల్లే రికార్డు లోనూ లేదు. తర్వాత శ్రోతల అభిరుచులమేరకు బహుళ జనాదరణ పొందిన పాటలన్నీ వుండేవి. అన్ని కచేరీలలో విధిగా 'దినకరా శుభకరా', అత్తలేనికోడలు ఉత్తమురాలు', 'పంచదార వంటి పోలిసెంకటసామీ', జయదేవుని అష్టపది 'రాధికా కృష్ణ రాధికా', కరుణశ్రీగారి పుష్పవిలాపం, జాషువాగారి 'పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కొసమై',  దేవదాసు లోని జగమే మాయా, కుడి ఎడమైతే, మాయాబజార్ లోని వివాహభోజనంబు,  ఇలా రకరకాల పాటలు పాడి ఆఖరుగా బ్రతుకుతెరువులోని 'అందమే ఆనందం' పాటతో తన కచేరీ ముగించేవారు. మాస్టారి కచేరీలలో ఎక్కువగా సోలో పాటలే వుండేవి. 'హాయి హాయిగా ఆమనిసాగే' వంటి యుగళాలు పాడినా ఆడ, మగ చరణాలు రెంటినీ ఆయనే పాడేవారు. ఘంటసాలగారి కచేరీలలో మరో విశేషం ఏమిటంటే ఆయన కచేరీలన్నీ సోలో కచేరీలే. ఇతర గాయకులతో కానీ, గాయనీమణులతో కానీ కలసి పాడిన సందర్భాలు బహు అరుదు. 
అలాగే, హెవీ ఆర్కెస్ట్రాతో చేసిన ఇతర సంగీత దర్శకుల పాటలను తన కచేరీలలో ఎక్కువగా పాడేవారు కాదు. కారణం, ఆయా పాటలలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యదాతథంగా ఉపయోగించడానికి ఆయా పాటల నొటేషన్స్ ను వ్రాయించి తన  కచేరీ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీసు చేయించాలి. అప్పుడే పాటకు పెర్ఫెక్షన్ వస్తుంది. కానీ అది  చాలా ఖర్చుతో కూడిన పని. కచేరీ నిర్వాహకులకు అంతంత భారీ మొత్తాన్ని భరించగలిగే ఆర్ధికస్తోమత చాలామంది నిర్వాహకులకు వుండేదికాదు. అప్పట్లో సంగీత కచేరీలు వ్యాపార దృక్పథంతో జరిగినవికావు. అందుచేత మాస్టారు సాధ్యమైనంతవరకూ తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలనే పాడేవారు. పాటకు పాటకు మధ్య సందర్భోచితమైన సరస సంభాషణలతో శ్రోతలను రంజింపజేస్తూ కచేరీలు చేసేవారు. ఘంటసాల మాస్టారు పాడితే చాలు, వారిని చూస్తూ పాట వినాలాని తహతహలాడే శ్రోతలే అధికంగా వుండేవారు. ఆయన గాత్ర మాధుర్యం వారి చెవినబడాలి అంతే. ఘంటసాల పాట ఏదైనా అమృత తుల్యమే. 

అలా ICF లోని  ఘంటసాలవారి కచేరీ సుమారు ఓ రెండు గంటలసేపు శ్రోతలను ఆనందంలో ఓలలాడించింది. 

కార్యక్రమానంతరం ICF నిర్వాహకులు ఘంటసాల మాస్టారికి ICFలో తయారయిన రైలుపెట్టె నమూనాను అద్దాలపెట్టెలో పెట్టి జ్ఞాపికగా బహుకరించారు. నేను హాజరయిన ఆ మొదటి సంగీతకచేరీ నాకెపుడూ అపురూపమే, అపూర్వమే.

ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మాస్టారింటి హాలులోని అద్దాల బీరువాలో మరో రైలుపెట్టె జ్ఞాపికను చూశాను. అయితే ఆ కచేరీకి నేను వెళ్ళలేదు. ఆ కచేరీ గురించి ఎన్నో దశాబ్దాల తర్వాత  'కళాసాగర్' సుభాన్ ముచ్చటించగా విన్నాను. అప్పట్లో ఎమ్.ఎ.సుభాన్ ICF లో ఉద్యోగం చేస్తూండేవారు. మంచి సాంస్కృతిక పిపాసి. అక్కడి తెలుగు అసోసియేషన్ లో ప్రధానభూమిక వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరో ఉగాదికి ఘంటసాల మాస్టారి కచేరీ ఏర్పాటుచేశారు. మాస్టారు ICFలో కారు దిగి కచేరీ వేదికవద్దకు వెడుతూండగా అక్కడి స్పీకర్లలో తన పాటే వస్తూండడం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను పాడిన ఆ పాట ఆ రోజు ఉదయమే ఉగాది సందర్భంగా ఆలిండియా రేడియో వారు బ్రాడ్ కాస్ట్ చేసిన ఉగాది పాట. అంత త్వరలో ఆ పాటను తిరిగి వినడం తటస్థిస్తుందని ఘంటసాల గారు ఊహించలేదుట. ఈ పాటను ఎంత శ్రమపడి రికార్డ్ చేసి సాయంత్రం సమయానికి ఘంటసాలగారి సమక్షంలోనే వినిపించిన సుభాన్ గారి కార్యదీక్షాదక్షతలకు ఘంటసాల మాస్టారు ఎంతగానో సంతోషించి అభినందించారట. ఆ విషయాలన్నీ సుభానే స్వయంగా నాకు చెప్పి ఘంటసాలవారి స్నేహ సౌహార్ద్రతను ఎంతో ప్రశంసించారు.  ఆనాడు ICF వారు ఇచ్చినదే ఆ రెండవ రైలు పెట్టె.

లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 
        ...సశేషం

Sunday, April 4, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఐదవ భాగం

04.04.2021 -  ఆదివారం భాగం - 25:
అధ్యాయం 2 భాగం 24  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1964 లో తెలుగు సినీమా ఖ్యాతిని ఇనుమడింప జేసిన సినీమాలెన్నో వచ్చాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఆత్మబలం, గుడిగంటలు, మూగమనసులు, అమరశిల్పి జక్కన్న, రాముడు భీముడు, డా.చక్రవర్తి, దాగుడుమూతలు, బొబ్బిలియుద్ధం మొదలైన సినీమాలు ఆర్ధికంగా ఘనవిజయం పొందాయి. ఈ సినీమాలన్నిటి విజయానికి సంగీతం,  ఘంటసాల గారు పాడిన పాటలే ఎంతో దోహదం చేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ అన్ని టివి ఛానల్స్ లో, సినీమా పాటల వేదికల మీద విస్తృతంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పాటల సజీవత్వానికి ఘంటసాల మాస్టారి అసాధారణ గానమాధుర్యమే కారణమని నా నిశ్చితాభిప్రాయం.

ఇక, ఘంటసాల మాస్టారు ఆ ఏడాది సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే -  గుడిగంటలు, మర్మయోగి, శ్రీ సత్యనారాయణ మహత్యం, వారసత్వం  - నాలుగూ ఎన్.టి.రామారావు కధానాయకుడిగా నటించినవే. రెండు సాంఘికం, ఒకటి జానపదం, ఒకటి పౌరాణికం. ఈ నాలుగు సినీమాలకు ఘంటసాల మాస్టారు మర్చిపోలేని సంగీతాన్నే అందించారు. 

ఈ నాలుగు సినీమాల విషయంలో నాకు తెలిసిన విషయాలు అనుభవాలు ఈ వారం తెలియజేస్తాను. 

మర్మయోగి సినీమా తమిళం రీమేక్. 1951 లో జూపిటర్ పిక్చర్స్ తీసిన ఈ సినీమా ఘన విజయం సాధించడమేకాక ఎమ్.జి.ఆర్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆకాలంలో కత్తియుద్ధాలకు ఎమ్జీయార్ పెట్టింది పేరు. అదే సినిమాను అదే జూపిటర్ పిక్చర్స్ వారు తెలుగులో ఎన్టీఆర్ తో అదే మర్మయోగి పేరుతో తీశారు. ఈ సినీమాలో రామారావు కొన్ని సీన్లలో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపిస్తారు. ఈ సినీమాకు సంబంధించినంతవరకు ఈ సినిమా లోని కధానాయకుడు ఎన్.టి.ఆర్. కథానాయిక కృష్ణకుమారిలకు  స్వరపర్చిన పాటలకంటే ఉపపాత్రలకోసం చేసిన పాటలు సన్నివేశపరంగా మంచి జనాదరణ పొందాయేమో అనిపిస్తుంది. లీలావతి (పి.లీల), గుమ్మడి (మాస్టారి నవ్వులు) కలసి నటించిన పడవ పాట 'నవ్వులనదిలో పువ్వుల పడవ' పాట, మరో ఉపపాత్ర లంక సత్యం కోసం మాస్టారు పాడిన పద్యాలు, ఆ తర్వాత కొందరు నర్తకీ మణులు (కోమల, జమునారాణి) పాడిన 'ఎందుకు పిలచితివో రాజా!' పాట చాలా హాయినికలిగిస్తాయి. 

ఈ చిత్రంలో జమునారాణి ఏకంగా నాలుగు పాటలు, అందులో మాస్టారితో మూడు డ్యూయెట్లు పాడడం ఒక విశేషమే. ఆవిడ nasal voice ఒక ప్రత్యేక ఆకర్షణగా  అభిమానించే రసికులెందరో వున్నారు.  

జానపదచిత్రం కావడాన కావలసినన్ని యుద్ధాలు, ఛేసింగ్స్, ఘోస్ట్  చేసే అట్టహాసాలు చూడడానికి ఉత్సాహం కలిగిస్తాయి. రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. సినీమా స్లోగా, డ్రాగీగా నాకు అనిపించింది. కానీ, ఒక్కొక్క సీన్ మీద మాస్టారు కంపోజ్ చేసిన బిట్స్ చూశాక నా అభిప్రాయమే మారిపోయింది. ఓపెనింగ్ సీన్సలోని ఆటలు, పోరాటాలు, మధ్య మధ్యలో హార్స్ ఛేసింగ్స్ వాటిమీద ఉపయోగించిన ట్రంపెట్స్, సాక్సోఫోన్, వైలిన్స్, ప్లూట్, క్లారినెట్, కాంగో, బేస్ డ్రమ్స్ ల ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఉత్సాహం రేకెత్తిస్తాయి.

ఈ సినీమాలో  మరో ముఖ్య ఆకర్షణ రాజుగారి దెయ్యం. మధ్య మధ్యలో వచ్చి వ్యాంప్  రాణి (లీలావతి)ని భయపెడుతూంటుంది. ఆ సీన్ లో రంపం, వైలిన్ బౌతో సృష్టించిన ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అలరించాయి. ఆ దెయ్యం చేసే కొన్ని ధ్వనులను తబలా ప్రసాద్ వినిపించాడు. అతని గొంతు దగ్గర పికప్ లు పెట్టి రికార్డ్ చేయడం బాగా గుర్తుంది. 

రక్తసంబంధం తర్వాత రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్లాల్ నహతా నిర్మించిన చిత్రం గుడిగంటలు. ఇదికూడా తర్జుమా చిత్రమే. శివాజీ నటించిన 'ఆలయమణి' ని గుడిగంటలుగా ఎన్టీఆర్ తో నిర్మించారు. ఆనవాయితీ ప్రకారం ఈ సినీమాలోని ఆరు పాటల్లో రెండు మాత్రమే మాస్టారి స్వయంప్రతిభను చాటే పాటలు. మిగిలిన నాలుగు తమిళం, హిందీ పాటల వరసలే. అయినా అవి కూడా తెలుగుదనం సంతరించుకునేలా స్వరపర్చడంలో మాస్టారి నైపుణ్యం కనిపిస్తుంది. పాటలన్నీ బహుళ జనాదరణ పొందాయి. 

టైటిల్ మ్యూజిక్ మీద షెహనాయ్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలు ప్రాధాన్యత వహించాయి. చిత్రం ప్రారంభం నుండి టెన్నిస్ మ్యాచ్ మీద వచ్చే రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళాను. ఎక్కువ పాళ్ళలో మెలోడ్రామా గల చిత్రం గుడిగంటలు. శివాజీ , ఎన్టీఆర్ నటించిన ఈ కథ హిందీలో (ఆద్మీ) దిలీప్ కుమార్ నటించడం ఆశ్చర్యమే. శివాజీ గణేశన్  హెవీడోస్ నటనకు, దిలీప్ కుమార్  సున్నితమైన ముఖభావాలకు పొంతనే కుదరదు. ఈ చిత్రంలో మాస్టారు పాడిన మూడు సోలోలు ఈనాటికీ అందరూ విని ఆనందిస్తున్నారు.

లాహిరి లాహిరి పాట తర్వాత మరోసారి నేను ఘంటసాల మాస్టారికి తీరని  ద్రోహం చేసాను. అది బొబ్బిలి కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నప్పుడు. కాలేజీ ఏనివర్శరీ ఫంక్షన్స్ లో కొంతమంది మిత్రద్రోహులు నన్ను అడగాపెట్టకుండా  పాటలు పాడేవారి లిస్ట్ లో నాపేరు వేయించారు. నా పేరు మైక్ లో ఎనౌన్స్ చేసే వేళకు నేను ఆ చుట్టుపక్కలే లేను. ఎక్కడో వున్న నన్ను బలవంతంగా స్టేజిమీదకు తోసారు. అసలే భసాపంకం. మా ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గట్టిగా పద్యాలు చదవడం తప్ప పాడడమనేదే లేదు. స్టేజి మీద అంతమంది లెక్చరర్ లు, స్టూడెంట్ల మధ్య ఏం పాడాలి? ఎవరి పాట పాడాలి. ఆ సమయంలో ఆ వూళ్ళో ఆడుతున్న 'గుడిగంటలు' లో పాట గుర్తుకు వచ్చింది. ఆ పాటలో  ప్రముఖ రచయితల కథానాయికల పేర్లు ఉపయోగించారు కవి దాశరధి. అప్పట్లో ఆ పాట పూర్తిగా గుర్తుండేది.  వెంటనే నా బాణీలో ఆ పాటను పాడేసాను. లేదా, చదివేసాను. మా బొబ్బిలి యువరాజా వారితో సహా అక్కడున్నవారంతా చాలా సహృదయులు.  నాకూ చప్పట్లు కొట్టారు. 'నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో'  పాటను ఎంతో భావయుక్తంగా  స్వరపర్చి, అద్భుతంగా గానం చేసిన ఘంటసాల మాస్టారికి గానం పేరిట  నాలాటివారెందరు అన్యాయం చేస్తున్నారో కదా!

పొడుగాటి గజిబిజి బిజిఎమ్స్ తో అసలు పాట పల్లవేదో మర్చిపోయేలా పాటల కంపోజింగ్ ఘంటసాల మాస్టారి శైలికాదు.  పాటలోని భావానికి తగినట్లుగా అవసరంమేరకు మాత్రమే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అందుకు అవసరమైన వాద్యాలను మాత్రమే ఉపయోగించడం, తాను పాడి, తోటి గాయకులచేత పాడించి కావలసిన రసభావాన్ని సృష్టించడమే మాస్టారి బాణీ. 

హెవీ ఆర్కెష్ట్రా హోరు, జోరు వల్లే పాట రక్తికడుతుందని అనుకునేవారికి పూర్తి వ్యతిరేకం ఘంటసాల బాణి. వారి పాటలన్నింటిలో గాయకులకే ప్రాధాన్యత. ఏ గాయకుడి రేంజ్ ఎంతవరకు, ఎవరెవరు ఏయే పాటలు పాడగలరన్నది ఆయనకు తెలిసినంత సుస్పష్టంగా ఇతర సంగీత దర్శకులకు తెలియదనే చెప్పాలి. అలాటి సున్నితమైన, శ్రావ్యమైన, లాలిత్యంతోకూడిన మంచి పాటలు గల చిత్రం 'వారసత్వం'. ఈ సినీమాకు ముందు అనుకున్న పేరు 'మమకారం'. ఆర్ధిక ఇబ్బందులవల్ల సినీమా నిర్మాణం దాదాపు మూడేళ్ళు సాగింది. సినీమా చేతులు మారి 'వారసత్వం' గా విడుదలయింది. వారసత్వంలో ఘంటసాల మాస్టారు, సుశీల ఆలపించిన 'ప్రేయసీ మనోహరి వరించి చేరవే', సుశీల పాడిన 'పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు', మాస్టారు, పి.లీల పాడిన 'చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ' పాటలు అపాతమధురాలుగా, అజరామర గీతాలుగా అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంతో శ్రావ్యమైనవి. 

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1964 లో విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'శ్రీ సత్యనారాయణ మహత్యం'. దాదాపు ఇరవై పాటలు, పద్యాలు గల సంగీత రసభరిత చిత్రం. ఘంటసాల మాస్టారి గాన వైదుష్యానికి దర్పణం పట్టే చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినీమాలో మాస్టారి తో పాటూ సుశీల, లీల, కోమల, స్వర్ణలత, వసంత, మాధవపెద్ది, రాఘవులు ఉన్న పాటలన్నింటిని పాడారు. 

1964 నాటికి ఘంటసాల సంగీతకుటుంబంలో మరో గాయకుడు వచ్చి చేరాడు. అతనే మొవ్వ జనార్దనరావు. బాగానే పాడేవాడు. కానీ అదృష్టం కలసిరాలేదు. మాస్టారి దగ్గరే వుంటూ కోరస్ లు పాడడం, మాస్టారి కంపోజింగ్ లకు రావడం, ఆయనతో రికార్డింగ్ లకు, కచేరీలకు వెళ్ళడం చేసేవాడు. మనిషి చాలా సౌమ్యుడు. సున్నితమైనవాడు. మాతో స్నేహపూర్వకంగా మెసిలేవాడు. ఈ సినీమా కోరస్ లలో మొవ్వ జనార్ధనరావు కూడా ఇతరులతో పాడాడు. ఘంటసాలవారి సంగీత కుటుంబంలో మరో ద్వయం - జనార్దన ద్వయం. ఇద్దరి ఇనిషియల్స్ 'ఎమ్' తోనే ఆరంభమౌతాయి. మిట్ట, మొవ్వ. మిట్టా జనార్దన్ సుప్రసిద్ద సితార్ విద్వాంసుడు. మొవ్వ జనార్దన రావు గాయకుడు. ఈ ఇద్దరితో పరిచయం పెరగనప్పుడు వీరిద్దరిలో ఎవరు జనా‌ర్దన్ , ఎవరు  జనార్దనరావు అనే తికమక చాలా రోజులుండేది.

ఈ సినీమా టైటిల్స్ మీద 'జయ జయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ నారాయణా' అనే దశావతార గీతం. ఈ పాటను రాగమాలికలో కంపోజ్ చేశారు మాస్టారు. ఈ పాట విషయంలో మాస్టారు ఒక కొత్తపోకడ పోయారనే అనుకుంటున్నాను. నేను అంతకుముందు ఏ పాటల్లోనూ అలాటి స్వర రచన వినలేదు. ఘంటసాల మాస్టారు, పి.లీల, బృందం పాడిన  ఈ పాట లో ఎక్కడా నేపథ్య వాద్య సంగీతం వినపడదు, లయ ప్రధాన వాద్యాలు తప్ప. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించవలసిన చోట్లలో మాస్టారు బృందగాయకుల గాత్రాలనే ఉపయోగించారు. స్వరాలు, ఛాయాస్వరాలను ఆయా గాయకులు ఆలపిస్తుండగా ప్రధాన పాటను మాస్టారు, లీల పాడారు. ఇదొక వైవిధ్యమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను. 


ఈ సినిమాలో మరో డ్యూయెట్ మాస్టారు, సుశీల పాడిన 'జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే, జలతారు మెరుపు నీవే' పాట. ఈ పాట కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్ కు అనారోగ్యం కారణంగా మా నాన్నగారు పూర్తిగా హాజరు కాలేదు. ఈ పాట ఆయన లేకుండానే జరిగింది. నేను ఆ పాట సమయంలో వుండడం మూలాన ఆ పాట ట్యూన్ ఎలా చేశారో మా నాన్నగారు నన్ను వినిపించమనేవారు. నేను కొంచెం అటుయిటుగా పాడి వినిపించేవాడిని. సినీమాలో ఈపాట నాయికా నాయకుల మధ్య సాగే యుగళగీతమే అయినా శృంగారభావాలేవీ ధ్వనించవు. నాయిక నాయకుని పరంగా ఆలపిస్తుంది. కానీ, నాయకుడు నాయికను తలచుకోవడానికి బదులుగా దైవాన్ని తల్చుకుంటూ పాడడం తరచూ మనం చూసే సినీమాలలో కనపడదు. మరి ఈ నావెల్టీని ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు.

ఈ సినీమాలో మాస్టారు పాడిన 'మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా' అనే పాట ఈ చిత్రానికే హైలైట్. ఘూర్జరీతోడి (శుభపంతువరాళి) రాగంలో కంపోజ్ చేశారు. మాస్టారు మూడు శృతిలో ఈ పాటను పాడారని చెప్పగా విన్నాను. పాట క్లైమాక్స్ లో మాస్టారి రెండిషన్ చాలా హైపిచ్ లో ఉంటుంది. ఈ పాట రికార్డింగ్ డేట్ ఫిక్సయి రికార్డింగ్ థియేటర్ కూడా బుక్ చేయడం జరిగింది. వాహిని స్టూడియో అనే గుర్తు. 

సరిగ్గా రికార్డింగ్ రోజున ఘంటసాల మాస్టారికి హై ఫీవర్. పైగా ముఖంమీద సెగగడ్డలు లేవడంతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా సావిత్రమ్మగారికి కలిగింది. కానీ, ఘంటసాల మాస్టారు ఆ సలహాకు సుముఖత చూపలేదు. ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే నిర్మాత చాలా నష్టపోతాడని ఆయన ఆవేదన. పైగా ఈ పాట షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్లుంది. ఎన్.టి.రామారావుగారితో షెడ్యూల్. ఈ అవకాశం కోల్పోతే మరల రామారావుగారి డేట్స్ కుదరడం కష్టం. ఈ విధంగా నిర్మాత సాధకబాధకాలన్నీ ఆలోచించి, తన అనారోగ్యాన్ని లక్ష్యపెట్టకుండా రికార్డింగ్ కు వెళ్ళడానికే నిశ్చయించారు. మంచో చెడ్డో ఆ సత్యనారాయణస్వామే చూసుకుంటాడని స్టూడియోకు బయల్దేరారు. ముఖం మీది సెగగెడ్డలకు మంచి గంధం పూతపెట్టుకొని జ్వరంతోనే వెళ్ళారు. మాస్టారు ధియేటర్ కు వెళ్ళే సమయానికి మా నాన్నగారు,  పాట నొటేషన్స్ ను, బిజిఎమ్ నొటేషన్స్ ను ఆర్కెష్ట్రా వారందరికీ చెప్పడం వారంతా వారి వారి బిట్స్ రాసుకోవడం అయింది. ఈ పాటలో ఎక్కువగా షెహనాయ్, వైలిన్స్, సెల్లో, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా వాద్యాలు వినిపిస్తాయి. ఘంటసాల మాస్టారు వచ్చి సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి ఆర్కెష్ట్రా వారు వాయించిన పాట విన్నారు. ఎవరికి ఇవ్వవలసిన సూచనలు వారికిచ్చి వాయిస్ తో ఒక మానిటర్ చూద్దామని తన మైక్ వద్దకు వెళ్ళారు. ఆనాటి ఆయన పరిస్థితిని చూసినవారంతా నిర్మాతతో సహా, జాలిపడి ఆరోజు రికార్డింగ్ కాన్సిల్ చేస్తే బాగుంటుందనే భావించారు. కానీ మాస్టారు ఒప్పుకోలేదు. మాస్టారికి ఏవిధమైన ఒత్తిడి తేకుండా అతి భక్తి శ్రద్ధలతో ఆర్కెష్ట్రా వారు జాగ్రత్తగా వాయించడం మొదలెట్టారు. ఇప్పటి రికార్డింగ్ సిస్టంకి, ఆనాటి విధానానికి హస్తిమశకాంతం తేడా. ఆనాడు ట్రాక్ సిస్టమ్ అంత అభివృద్ధి చెందలేదు. లైవ్ రికార్డింగ్ చేయడానికే అందరు సంగీతదర్శకులు పాటుపడేవారు. ఒక పాట రికార్డింగ్ అనేది ఒక సమిష్టి కృషి. ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. అనేక విభాగాల సాంకేతిక నిపుణులంతా కలసి పనిచేస్తేనే ఒక పాట బయటకు వస్తుంది. ఆరోజు అందరికీ ఒకటే ఆలోచన. ఘంటసాలగారిని ఎక్కువ శ్రమ పెట్టకుండా పాట పూర్తిచేయాలి. ఆర్కెష్ట్రాతో వాయిస్ మానిటర్ చూశారు.  మాస్టారు వెంటనే
రెడీ ఫర్ టేక్ అన్నారు. ధియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలన్స్. పస్ట్ టేక్ ప్రారంభమయింది. ఘంటసాల మాస్టారిలో ఏ దైవం ఆవహించిందో తెలియదు. తన జ్వరం, సెగగడ్డల బాధ అన్నీ మర్చిపోయారు. ఆ మూడు శృతిపాటను అద్భుతంగా ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా పాడారు. పాట క్లైమాక్స్ లో 'మాధవా ! కేశవా' అంటూ బాధతో తదాత్మ్యం చెంది పెట్టిన కేకతో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లింది. ఏదో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందేమోననే అందరూ భయపడ్డారు. కానీ ఏమీ జరగలేదు. మాస్టారిలోని భావావేశానికి ఆర్కెష్ట్రాతో సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. షెహనాయ్ సత్యం అయితే బొటబొటా కన్నీరే కార్చారు. ఇక సెకెండ్ టేక్ కు అవసరమే లేకపోయింది. అందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్. అనుకున్న సమయానికి రికార్డింగ్ పూర్తి అయింది. ఎన్టీఆర్ తో షూటింగ్ పూర్తి అయింది. ఇది నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన. అందుకే సంగీతం దైవదత్తమని, ఘంటసాల మాస్టారు దైవాంశసంభూతుడని మనస్ఫూర్తిగా నమ్ముతాను.

ఈ సినీమా పూర్తికాకుండానే ఈ సినీమాను డైరక్ట్ చేస్తున్న ఎస్ రజనీకాంత్ మరణించారు. మిగిలిన సినీమాను ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కె. గోపాలరావు పూర్తిచేశారు. చిత్రాన్ని రజనీకాంత్ గారికి అంకితమిస్తూ డైరెక్టర్ గా ఆయన పేరే వేశారు.

ఘంటసాల మాస్టారి సినీ జీవితచరిత్రలో ఇలాటి మరచిపోలేని ఘట్టాలెన్నో! నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. 

రామచంద్రరావు. ఇంటిపేరు దేవగుప్తాపు. విశాఖపట్నం జిల్లావాడు. సొంతవూరు ఏదో నాకు గుర్తులేదు. ఘంటసాలవారి చిరకాలమిత్రుడు. సావిత్రమ్మగారికంటే ముందునుంచి సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి. రామచంద్రరావు, ఘంటసాలగారిని కలపి మైత్రీబంధం పెంచినది పానగల్ పార్క్ అరుగులే. ఇద్దరూ జీవనోపాధి వెతుక్కుంటూ మెడ్రాస్ చేరినవారే. అష్టకష్టాలు పడినవారే. ఎప్పుడైతే ఘంటసాలగారికి గాయకుడిగా పేరు రావడం ప్రారంభమయిందో అప్పటినుండే ఆకలి దప్పులు తీర్చుకోవడానికి తగిన ఆదాయము రావడం ప్రారంభించింది. అటువంటి సమయంలో పార్క్ స్నేహితుడిని వదిలేసి ఘంటసాలవారు తన దారి తాను చూసుకోలేదు. ఆ మిత్రుడిని కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. మాస్టారు, రామచంద్రరావు కలసి మోతీలాల్ స్ట్రీట్, రామానుజం స్ట్రీట్ లలో అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేశారు.  సావిత్రమ్మగారు మొట్టమొదటిసారిగా మద్రాసు కాపరానికి వచ్చినప్పుడు తోడుగావుండి తీసుకువచ్చినది ఈ రామచంద్రరావేనట. చిన్న వయసులోనున్న సావిత్రమ్మగారికి దగ్గరుండి వంటావార్పు నేర్పింది కూడా ఈ రామచంద్రరావే. ఘంటసాల వారి కుటుంబానికి చాలా ఆత్మబంధువు. ఒక్క ఘంటసాలగారిని తప్ప మిగిలిన వారందరినీ ఏకవచనప్రయోగమే. మాస్టారిని మాత్రం గౌరవంగా అయ్యగారు అని పిలిచేవారు. అంతటి ఆత్మీయంగా మెలిగిన కారణంచేతనే ఘంటసాల మాస్టారు తన స్వగృహప్రవేశం సమయంలో తన మిత్రుడైన రామచంద్రరావుకు దగ్గరుండి ఘనంగా ఉపనయనం జరిపించారు. ఆ విషయాలు గతంలో నెం.35, ఉస్మాన్ రోడ్ లో చోటుచేసుకున్నాయి.

నెం. 35, ఉస్మాన్ రోడ్ ఒక పుష్పక విమానంలాటిది. ఎంతమంది వచ్చినా మరొక్కరికి చోటు వుంటూనే వుండేది. మేస్టారింటి మేడమీద ఎంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయో. వారంతా నాకన్నా వయసులో బాగా పెద్ద. మా నాన్నగారికంటే వయసులో చిన్నయినా నాకు వారెవరూ సమవయస్కులు కారు. అయినా అందరూ ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ రామచంద్రరావు మా అమ్మగారిని అక్కయ్యగారని పిలిచేవారు.

మనిషి సన్నగా, చామనఛాయతో, పక్కపాపిడి క్రాఫింగ్ తో ఎప్పుడూ ప్యాంట్,  ఫుల్ హ్యాండ్ షర్ట్ తో మహానీటుగా వుండేవారు. చేతిరుమాలులో పౌడర్ వేసుకొని ఆ రుమాలును మెడ వెనకనుండి ముందుకు చుట్టుకోవడం ఫస్ట్ ఫస్ట్ రామచంద్రరావు దగ్గరే చూశాను. ముందు రెండు పళ్ళు కొంచెం ఎత్తుగానే వుండేవి. చైన్ స్మోకర్. ఇంట్లో కాల్చేవారు కారు. కానీ మేడమీద రోడ్లమీద వెళుతున్నప్పుడు చాలా సిగరెట్లే కాల్చేవారు. ఘంటసాల మాస్టారి సినీమా నిర్మాణ వ్యవహారాలలో ఏమాత్రం పాత్ర వహించారో నాకు అంతగా గుర్తులేదు, కానీ, మద్రాస్ హార్బర్ లో ఏదో ఉద్యోగం చేసేవారు. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం దాటాక ఇంటికి చేరేవారు. హార్బర్ నుండి అప్పుడప్పుడు ఏవో ఫారిన్  వస్తువులు, తినుబండారాలు తెచ్చేవారు. మాస్టారింట్లోనే భోజనవసతులన్నీ. అలాటి రామచంద్రరావుకు ఏదో అనారోగ్యం ఏర్పడింది. తరచూ దగ్గుతూవుండేవారు. అయినా సిగరెట్లు మానలేదు. డాక్టర్లు పరిక్ష చేసి చూసి క్షయ అని నిర్ధారించారు.  విశ్రాంతి కోసమని కొన్నాళ్ళ తర్వాత హార్బర్ ఉద్యోగం మానేశారు. మైలాపూర్ లజ్ కార్నర్ లో ఏదో ఒక కాఫీ హోటల్ లో గల్లాపెట్టి దగ్గర కూర్చొనే ఉద్యోగం చేశారు. అదీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తోడుగా ఊరినుండి అతని మేనల్లుడో, అన్నకొడుకో ఒక అబ్బాయి వచ్చి మాస్టారింట్లోనే గడిపాడు. చివరకు వ్యాధి ముదిరి, పిల్లలున్న ఇంట్లో గడపడం శ్రేయస్కరం కాదని విశాఖపట్నం కెజిహెచ్ లో చేరారు. అలాటి గడ్డు పరిస్థితులలో కూడా ఘంటసాల మాస్టారు తన మిత్రుడిని ఆర్ధికంగా ఆదుకున్నారు. ప్రతీ నెల రామచంద్రరావుకు కొంత పైకాన్ని మనీఆర్డర్ ద్వారా పంపేవారు. చిన్నవయసు కావడం వలన కొన్ని విషయాలు అర్ధమయి కాకుండా వుండేవి.

ఒకసారెప్పుడో మా అమ్మగారితో మా పిల్లలం అందరం బొబ్బిలి వెళుతున్నప్పుడు మాకు వాల్టేర్ స్టేషన్ లో  చాలా దీనస్థితిలో కనిపించారు. మా అమ్మగారి దగ్గర కష్టసుఖాలు చెప్పుకున్నారు.

ఈలోగా రైలు కదిలింది. కానీ రామచంద్రరావు క్రిందికి దిగలేదు. నాకు ఒకటే కంగారు, ఎలా దిగగలడని. లేపోతే అతను కూడా మాతో బొబ్బిలి వస్తున్నారా అని తెలియదు. కానీ ఆయన మాత్రం మా అమ్మగారితో కబుర్లు చెపుతునే వున్నారు. ఆ రైలు విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి తిరిగి వాల్టేర్ వచ్చేక రామచంద్రరావు క్రిందికి దిగారు. ఆయనకు మా అమ్మగారు కొంత డబ్బు ఇవ్వడం చూశాను. ఆ పైకం తీసుకుంటున్నప్పుడు రామంచంద్రరావు కళ్ళలో నీళ్ళు చూసి నాకు చాలా బాధ కలిగించింది. 

ఆ రోజుల్లో చాలా రైళ్ళు వాల్టేర్ స్టేషన్ నుండి విశాఖపట్నం స్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి మళ్ళా వాల్టేర్ స్టేషన్  వచ్చి ఆగి అక్కడనుండి గోపాలపట్నం జంక్షన్ దాకా వచ్చాక మెడ్రాస్ వెళ్ళేవి, హౌరా వెళ్ళేవి, రాయపూర్ వెళ్ళేవి డైవర్ట్ అయ్యేవి.

అదే రామచంద్రరావును ఆఖరిసారిగా చూడడం. ఆ తర్వాత ఎప్పుడో వ్యాధి ముదిరి విశాఖ కెజిహెచ్ లోనే కాలం చేశారని విన్నాను.

రైలు పయనంలాటి ఈ జీవితంలో ఎంతోమంది తారసపడుతూంటారు. కలసి ప్రయాణం చేస్తాం. ఎవరి మజిలీ వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతూంటారు. కొందరిని మరల చూసే అవకాశం వుంటుంది. కొందరి గురించి ఏ విషయాలు తెలియవు. కాలక్రమేణా మనకు ఆప్తులనుకునేవారంతా మనకు తెలియకుండానే మన  జ్ఞాపకాల దొంతరలనుండి కనుమరుగైపోతారు. ఎవరికి ఎంతవరకు ఋణానుబంధమో అంతవరకే ఈ బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అన్నీ. ఉన్న నాలుగు రోజులు మంచిగా, అందరితో సఖ్యంగా వుంటూ మంచివాడనిపించుకోవడమే మనం చేయవలసింది. ఈ సూత్రాన్నే ఘంటసాల మాస్టారు తన స్వల్ప జీవితంలో తూ.చ. తప్పక పాటించారని నాకు అనిపిస్తుంది. 

మరిన్ని ఉత్సాహభరిత విశేషాలతో వచ్చే వారం...
...సశేషం

Sunday, March 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై నాలుగవ భాగం

28.03.2021 - ఆదివారం భాగం - 24:
అధ్యాయం 2  భాగం 23 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
తూర్పున బంగాళాఖాతంలో నుంచి ఉదయించిన సూర్యుడు తన కిరణాలను మా లోగిట్లోకి ప్రసరించకముందే, ఒక రోజు ఉదయం, చాలా తిరుపతి గుళ్ళు మా ఇంటి వాకిట ప్రత్యక్షమయాయి. ఇది మేము 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు వచ్చిన కొత్తల్లో. తిరుపతిలో కనిపించే గుళ్ళు మెడ్రాస్ లో మా ఇంటివాకిట్లో చూడడం అదే మొదటిసారికావడం వలన నాకు వింతగా అనిపించింది. 
"ఒరే! అప్పన్నా! ఇదేరా ఘంటసాల ఇల్లు. ఆపు, బండాపు' అని ఒకరు, 'ఓయ్ ఓబులేశు!  ఉస్మాన్ రోడ్ లో 35 నెంబరు ఇల్లు ఇదే. ఘంటసాల పేరుంది. అందరు దిగండి, దిగండి" అనే అరుపులతో మాకు తెల్లవారడం అలవాటయిపోయింది. 

మాయాబజార్, వినాయకచవితి, వెంకటేశ్వర మహత్యం వంటి సినీమాల ప్రభావంతో, ఏడుకొండల సామి మీద ఘంటసాల పాడిన భక్తిగీతాల మహత్యంతో తిరుపతి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తజనమంతా మద్రాసు క్షేత్రాన్ని కూడా సందర్శించి తమ అభిమాన సినీమా దేవుళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ దర్శనం కోసం కాచుకొని మరీ చూసి మహదానందపడేవారు. టూరిస్ట్ బస్సుల వారంతా తిరుపతి, పరిసర ప్రాంతాలతోపాటూ మద్రాస్ స్టార్ దర్శనం అనే ప్రత్యేక ఆకర్షణ కల్పించి తమ టూరిస్ట్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లజేసుకున్నారు. మద్రాస్ తెలుగు సినీమాకు కేంద్రంగా వున్నంతకాలం తిరుపతి యాత్రీకుల బస్సులతో మా ఉస్మాన్ రోడ్ ఉదయం తొమ్మిది గంటలవరకు కోలాహలంగా వుండేది. ఎందుకంటే సినీమావాళ్ళెప్పుడు ఉదయం తొమ్మిది దాటితే ఇళ్ళ దగ్గర దొరకరు. కోడంబాక్కం స్టూడియోలలో పట్టుకోవలసిందే. రికమెండేషన్ లేకుండా ఏ స్టూడియో వాళ్ళు ఈ యాత్రీకాభిమానులను లోపలికి వదిలే సాహసం చేయరు. 

జనవరి సంక్రాంతి సమయంలో పాడిపంటలు ఇంటికి చేరాక అందరి చేతుల్లో నాలుగు డబ్బులు కనిపిస్తాయి. ఆ ఆనందంతో కుటుంబాలతో తీర్థయాత్రలు మొదలెడతారు. అప్పటినుండి వేసవి శెలవులు పూర్తి అయేవరకూ ప్రతీరోజూ ఐదారు బస్సులకు తక్కువ లేకుండా తిరుపతి యాత్రీకులు మా ఇంటిగేటు ముందు నిలబడేవారు. వారిలో డెభ్భై, ఎనభై ఏళ్ళ వృధ్ధుల నుండీ మూడు, నాలుగేళ్ళ పసిపాపల వరకూ ఆడా, మగా వుండేవారు. నడవలేని స్థితిలోకూడా చేతికర్ర ఊతంతో తిరుపతి వెంకన్నను ఎంత భక్తితో దర్శించుకునేవారో అదే భక్తితో మద్రాస్ లో ఘంటసాల వేంకటేశ్వరుని, నందమూరి తారకరాముని, తదితర సినీ నటీనటులను చూసి ఆనందించేవారు. 

అసలు నిజం చెప్పాలంటే, మద్రాసులోని, మా టి.నగర్ లోని సినీమావారుండే ప్రాంతాలు ఆ ఇళ్ళ అడ్రస్ లు నాకు కంఠోపాఠం అవడానికి ముఖ్య కారణం ఈ తిరుపతి బస్సులే. ఆనాటి ఆంధ్రదేశం నుండి వచ్చే చాలామంది బస్సుల డ్రైవర్లకు అరవభాషతో సమస్య. యాత్రీకులను ఆకట్టుకుందికి మెడ్రాస్ ట్రిప్ లు వేస్తారే కానీ  మొదటిసారి వచ్చేవాళ్ళకు ఈ ఊరిగురించి ఏ అవగాహన వుండేది కాదు. టి.నగర్ ఉస్మాన్ రోడ్ కు రాగానే ముందుగా మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద రాజభవనంలా కనిపించేది ఘంటసాలగారి ఇల్లే. అందుకే తిరుపతి బస్సులవాళ్ళకు మొదటి హాల్ట్ నెం.35, ఉస్మాన్ రోడ్డే. అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ మాత్రం ముందుగా వచ్చి 'అయ్య ఉన్నారా!' 'ఘంటసాలగారు లోపలున్నారా!' 'ఘంటసాలవాడు ఉన్నాడా!' 'పాటల దేవుడు ఎన్నింటికి బయటకు వస్తారు' ఇలా ఎవరికి తోచిన భాషలో వారి వారి చదువు సంధ్యలు, సంస్కారాన్నిబట్టి అడిగేవారు. వీళ్ళ ప్రశ్నలకు టార్గెట్  అప్పుడప్పుడు తమ్ముడు కృష్ణ , మా తాయి, ఆవిడ కొడుకు వడివేలు, కారు డ్రైవర్ గోవిందు. అయ్యగారు బయటకు వెళ్ళేవరకు కారు కడగడం, తుడవడం తప్ప మరే పని లేని గోవిందుకు ఓ నాలుగు బీడీలు చేతిలోపెట్టి వాళ్ళకు కావలసిన సమాచారాన్ని బాగానే లాగేవారు ఆ బస్సులవాళ్ళు. అయితే గోవిందు మాట్లాడే అరకొర అరవ తెలుగు వాళ్ళకు అర్ధమయేది కాదు. ఆ సమయంలో పనిపాటాలేని ఆపద్బాంధవుడిని నేను మాత్రమే. గోవిందు తన తరఫున నన్ను చెప్పమనేవాడు. డ్రైవర్  గోవిందు చెప్పిన దానిని తిరిగి నేను స్వఛ్ఛమైన మా విజయనగరం తెలుగులో చెప్పేవాడిని. వచ్చేవాళ్ళలో చాలామంది ఉత్తరాంధ్రదేశంలోని పల్లెటూళ్ళకు చెందినవారవడంతో వారికి నా మాటలు బాగా అర్ధమై చాలా సంతోషపడేవారు. గోవిందు చెప్పిన సినీమావాళ్ళ ఎడ్రస్ లు ఆ డ్రైవర్లకు, కుతూహలంగా వెంటవచ్చిన తిరుపతి యాత్రీకులకు విడమర్చి చెప్పేవాడిని.

మా ఇంటి ఎదురుగా కె.వి.రెడ్డి, వ్యాసారావు స్ట్రీట్ లో నాగయ్య (తరువాతి కాలంలో రమణారెడ్డి), బజుల్లా రోడ్ లో ఎన్.టి.రామారావు, కస్తూరి శివరావు, సారంగపాణి స్ట్రీట్ లో అక్కినేని నాగేశ్వరరావు, అతి పొడుగాటి హబిబుల్లా రోడ్ లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు, గుమ్మడి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, తిరుమలపిళ్ళై రోడ్ లో జమున, అక్కడి సమీపంలోనే కాంచన, మహాలింగపురంలో నాగభూషణం, శారద, నీలకంఠమెహతా స్ట్రీట్ లో రేలంగి, వైద్యరామయ్యర్ స్ట్రీట్ లో భానుమతి (అయితే ఆవిడ కోడంబాక్కం భరణి స్టూడియో ఎదురుగా వుండే భవనంలోనే వుండేవారు),  సౌత్ బోగ్ రోడ్ లో శివాజీ గణేశన్, ఆర్కాట్ స్ట్రీట్ లో ఎమ్జీయార్ ;  రామన్ స్ట్రీట్ లో కె.ఆర్.విజయ, గాయని ఎస్ జానకి, జెమినీ స్టూడియోకు సమీపంలో నుంగబాక్కం హైరోడ్ జెమినీ గణేశన్, రట్లండ్ గేట్ లో జగ్గయ్య, కోడంబాక్కం నాగార్జున నగర్ లో మిక్కిలినేని, పద్మనాభం, కొంచెం దూరంలో బాలకృష్ణ, సౌత్ ఉస్మాన్ రోడ్  సిఐటి నగర్ లో పెండ్యాల, పి.బి.శ్రీనివాస్, తేనాంపేట ఎల్డామ్స్ రోడ్ లో సి.ఎస్.ఆర్., ఎస్.ఎస్.రాజేంద్రన్, దేవిక, సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు, టి.వి.రాజు, ఆళ్వార్ పేట సీతమ్మకాలనీలో పి.సుశీల, సెనెటాఫ్ రోడ్ లో షావుకారు జానకి, రాజా అణ్ణామలైపురంలో అంజలీదేవి, అడయార్ లో బి.సరోజాదేవి. ఇలా తమ అభిమాన తారాగణం వివరాలు తెలుసుకొని ఉబ్బితబ్బిబైయేవారు. అలాగే, బ్రతికిన కాలేజి (జూ), చచ్చిన కాలేజి (మ్యూజియం), మెరీనా బీచ్, హైకోర్ట్, లైట్ హౌస్, హార్బర్, మూర్ మార్కెట్ వంటి యాత్రాస్థలాలకు వెళ్ళే మార్గాలను సేకరించేవారు. ఇంతమంది ఎడ్రస్ లు నాకు తెలియడానికి, గుర్తుండిపోవడానికి కారణం ఈ తిరుపతి యాత్రీకులు, డ్రైవర్ గోవిందు చలవే. నేను మద్రాస్ రూట్ మ్యాప్ తెలుసుకోవడంలో చాలా సహాయపడింది వీరే అని చెప్పాలి. 

అయితే ఈ తిరుపతి యాత్రీకులకు సినీమావాళ్ళందరి దర్శనభాగ్యం లభించేదా అంటే సందేహమే. వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా వారితో సరదాగా మట్లాడి వారిని తృప్తి పర్చేవారిలో ఘంటసాల, ఎన్.టి.రామారావు ముఖ్యులని వారిని చూడడానికి వచ్చే అభిమానులు చెప్పుకోగా చాలాసార్లు విన్నాను. మిగతా చాలామంది నటీనటులను కోడంబాక్కం రైల్వేగేట్ దగ్గర కార్లలో పడిగాపులు పడుతూండగా చూసి ఆనందించేవారు.

సినీ నటుల తర్వాత ఈ తిరుపతి యాత్రికులంతా చూసి అమితంగా చూసి సంతోషపడేది ఘంటసాల మాస్టారినే. ఆయన వచ్చినవారిని పలకరించే తీరు, కలుపుగోలుతనం వారికి తమ సొంత మనిషితో మాట్లాడుతున్నామనే భావన కలిగించేది. ఘంటసాల మాస్టారు ఇంటిలో వున్నప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడకుండా పంపలేదు. తనను చూడాలనే ఆశతో ఎక్కడో సుదూరప్రాంతాలనుండి వచ్చినప్పుడు నాలుగు మంచిమాటలతో ఆనందపర్చడం తన కర్తవ్యంగా భావించేవారు. 

మాస్టారిని చూడడానికి వచ్చేవారిలో అన్ని రకాలవారూ ఉండేవారు. ఫలానా సినీమాలో మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి అని కొందరూ, సినిమా లో మీ పాటలకి, ఇప్పడు మీరు మాట్లాడే మాటకు పోలికే లేదని కొందరూ, ఎన్.టి.రామారావుకు, ఎ.నాగేశ్వరరావుకు, రేలంగికి ఎవరికి పాడినా వారు పాడుతున్నట్లే మాకు అనిపిస్తుంది అదెలా పాడతారు అని కొందరు 
'బాబూ ముసలిదాన్ని అడుగుతున్నాను ఏడుకొండలసామీ మీద పాట పాడి వినిపించవా' ఇలా రకరకాల ప్రశ్నలు వేసేవారందరికీ ఓపికగా సమాధానాలు చెప్పేవారు. వాళ్ళు ఏ ఏ సినీమాలు చూశారు. ఏ పాటలు బాగా నచ్చాయని అడిగి తెలుసుకునేవారు. ఒకసారి తిరుపతి యాత్రీకుల బస్సులో ఓ పది పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు. అందరూ ఘంటసాలగారితో మాట్లాడుతుంటే వాడికీ ఏదో  అడగాలని తహతహ. చివరకు ధైర్యం చేసి మీరు ఏదైనా పాట పాడండి అని అడిగాడు. అందుకు మాస్టారు "నేను సినీమాలలో పాడుతున్నది నువ్వు వింటున్నావు కదా ! నువ్వే ఒక పాట పాడు వింటాను" అని ఎదురు అడిగారు. "నేనా! పాటా! నాకు రాదే, మీరే పాడి వినిపించండి" అన్నాడు. "అయితే నీ పెళ్ళికి నా కచేరీ పెట్టించు. అప్పుడు మీ ఊరు వచ్చి ఏన్నో పాటలు పాడతాను" అని అనగానే ఆ కుర్రాడు సిగ్గుతో అష్టవంకరలుపోయాడు. అక్కడ వచ్చినవారంతా గొల్లుమని నవ్వి ఆ కుర్రాడిని వెంటనే పెళ్ళిచేసుకోరా ఘంటసాల మనూరు వచ్చి పాడతాడు అని ఆ పిల్లాడిని ఎగతాళి చేస్తూ సంతోషంగా మాస్టారి దగ్గర శెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. 

ఒకసారి ఘంటసాల మాస్టారిని చూసినవారుకానీ, మాట్లాడినవారు కానీ ఆయనను కానీ, ఆయన మాటకారితనాన్ని కానీ ఎన్నటికీ మరువలేరు. ఘంటసాలగారి వ్యక్తిత్వం అలాటిది. ఘంటసాలవారి నెం.35, ఉస్మాన్ రోడ్ ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో కలకలలాడుతూవుండేది. సొంత సినీమా నిర్మాణం ఆపేసినా ఎవరో బంధుమిత్రులతో ఆ ఇల్లునిండే వుండేది. మాస్టారింట్లోనే భోజనాలు చేసేవారు కొందరైతే బయటే భోజనాలు చేసి రాత్రి మాస్టారింటి మేడమీద నిద్రలుపోయి ఉదయాన్నే తమ తమ పనులు చూసుకునేవారు కొందరు.

మా నాన్నగారు విజయనగరం వదలి మద్రాసు రావడానికి తీవ్రమైన ప్రేరణ, ఒత్తిడి తెచ్చిన సన్నిహితులు ఇద్దరు. ఒకరు ఘంటసాల మాస్టారు అయితే, మరొకరు, ద్వివేదుల నరసింగరావు. ఆయనే మా నాన్నగారికి రైలు టిక్కెట్ కూడా కొనిచ్చి బలవంతాన సాగనంపారు. వారి అమ్మాయి ఛాయకు మా రెండో చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ సంగీతం కూడా నేర్పారు. నరసింగరావుగారు విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో లెక్చెరర్ గా పనిచేసేవారు. ఆయన భార్య శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు అప్పటికే రచనా వ్యాసాంగంలో అడుగుపెట్టారనుకుంటాను.

మేము విజయనగరం నుండి వచ్చేక నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్షిప్ మీద అమెరికాలో ఉన్నత విద్యలకు వెళ్ళారు. అక్కడ విస్కన్సిన్ యూనివర్శిటీ లో ఎకానామిక్స్ లో పి.హెచ్.డి. చేశారు. అక్కడ డాక్టరేట్ చేస్తున్న సమయంలోనో లేక ముగిసిన తర్వాతో ఒకసారి మద్రాస్ వచ్చి మా నాన్నగారిని, ఘంటసాల మాస్టారిని చూడడానికి వచ్చారు. ఆయన ఎక్కడవున్నా మా నాన్నగారితో చాలా తరుచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు.

నరసింగరావుగారు మద్రాస్ వస్తూ తనతో కూడా ఒక పెద్ద టేప్ రికార్డర్ తీసుకువచ్చి ఇండియాలో తమ బంధుమిత్రుల సంభాషణలు, పాటలు, పద్యాలు రికార్డ్ చేసుకొని తీసుకువెళ్ళారు. ఆ సమయంలో, ఘంటసాల మాస్టారింట్లోని చిన్న హాలులో ఉత్తరం గోడకు ఆనుకొని ఒక పెద్ద టేబిల్ వుండేది. దానిమీద ఆ భోషాణం స్పూల్ టేప్ రికార్డర్ పెట్టి అందరి గొంతులు రికార్డ్ చేశారు. మాస్టారు, మా నాన్నగారు కొన్ని పాటలు, పద్యాలు పాడారు. చిన్నా పెద్దా అందరిచేతా పాడించారు, మాట్లాడించారు. నావంతు వచ్చింది. పాడు పాడమని ఒత్తిడి చేశారు. అంతమంది మధ్యలో పాడడమే! నా గొంతు తడారిపోయింది. అప్పటికి నాకు పధ్నాలుగు, పదిహేనేళ్ళుంటాయి. నాగొంతు పీలగా, ఆడపిల్ల గొంతులానే వుండేది. ఆ వయసులోనే మా నాన్నగారు నాకు సంగీతం నేర్పాలని ప్రయత్నించారు. నా గొంతుకు ఏ శృతి సరిపోతుందో ఆయన సంగీతజ్ఞానానికి తట్టలేదు. అలాగే గీతాలవరకు నేర్చుకున్నాను. ఆయన చెప్పిన పధ్ధతిలో పాడకుండా అరవయాసతో (స్థానికప్రభావం వల్ల)  పాడడం ఆయనకు సుతారము నచ్చలేదు. గాత్రం లాభం లేదని వీణ, హార్మోనియం కూడా నా మీద ప్రయోగించి చూశారు. వినాయక చవితిలోని 'దినకరా శుభకరా' పాట ప్రాక్టీస్ ముగియకుండానే హార్మోనియం ప్రాక్టీస్ అటకెక్కిపోయింది. అలాగే వీణ సాధన కూడా. గీతాలతో ఆగిపోయింది. సంగీతానికి అతిముఖ్యమైన శృతి, లయలు రెండింటికి నన్ను చూస్తే భయమే. ఇలాటి నన్ను పట్టుకొని 'పాడమని నన్ను అడగతగునా'. అయినా తప్పలేదు. మొదటిసారిగా మైక్ ముందు మాయాబజార్ లోని 'లాహిరి లాహిరి' పాట ఎత్తుకున్నాను. అది పాటా, మాటో నాకే తెలియలేదు. పాడడం అయ్యాక నేను పాడినది మళ్ళీ రీ-ప్లే చేశారు. అందరూ ఒకటే నవ్వులు. ఆ నవ్వులకు అర్ధం నాకు తెలుసు. ఇక జన్మలో ఏనాడు నా పాటతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే నియమాన్ని ఈనాటి వరకు నిలబెట్టుకున్నాను. మధ్య మధ్య వ్రతభంగం జరిగిందనుకోండి. అయితే నాకన్నా మహాన్యాయంగా పాడుతూ అందరిచేత చప్పట్లు కొట్టించుకున్న వాళ్ళని తర్వాతి కాలంలో చాలామందినే చూశాను. అయినా నేను టెంప్ట్ కాలేదు. I am great to that extent. అయినా లలితకళలు అబ్బడమనేది పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. కృషి, సాధన కొంతవరకే ఉపయోగపడతాయి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలు విద్యాలయాలలో నేర్చుకున్నంతమాత్రాన వచ్చేవికావు. అక్కడ శాస్త్రపరిజ్ఞానం అలవడుతుంది. అంతవరకే. స్వతసిధ్ధమైన జ్ఞానంలేకపోతే ఏ డిగ్రీలు పనిచేయవు. 

ఆ రోజు ద్వివేదుల నరసింగరావుగారు నెం.35, ఉస్మాన్ రోడ్ లో చాలాసేపు వున్నారు. మాస్టారింటి మెయిన్ హాలులో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడారు. ఆయన వేసుకున్న సూటు, బూటు (హ్యాట్ మాత్రం లేదు), మాటా, చేష్టా అంతా యూరోపియన్ కల్చర్ వంటబట్టిన మనిషంటే ఇలాగే వుంటారేమో అని అనిపించింది. విజయనగరం ఎమ్.ఆర్. కాలేజీలో  లెక్చెరర్ గా పనిచేసేప్పుడు అక్కడి స్టూడెంట్స్ ఈయనను దిలీప్ కుమార్ అనేవారట. కానీ ఆయన ఒడ్డు, పొడుగూ నామట్టుకు ప్రదీప్ కుమార్ లా అనిపించేది. 
ఆనాటి అమెరికన్ యూనివర్శిటీలలో విద్యా విధానానికి, మన దేశపు విద్యా విధానాలకు గల తేడాలు , అక్కడి ప్రొఫెసర్లు, స్టూడెంట్ల మధ్య వుండే గురు శిష్య సంబంధాలు, బోధనా పధ్ధతులు, ఇలా చాలా విషయాల మీద ఆయన మాట్లాడడం నాకు బాగా గుర్తు వుంది. ఆయన చెప్పిన విషయాలన్ని ఘంటసాల మాస్టారితో సహా ఇంట్లోని వారంతా చాలా శ్రధ్ధగా ఆలకించారు. 

1953 లో ఘంటసాలవారు తమ కుటుంబంతో మా తాతగారిని చూడడానికి విజయనగరం వచ్చినప్పుడు ఈ నరసింగరావుగారింట్లో కూడా ఆతిథ్యం పొందడం గుర్తుకు వచ్చింది. అయితే అప్పటి నరసింగరావుగారు నాకు గుర్తులేరు. 1971 లో ఘంటసాల వారు విదేశాలలో పర్యటించడానికి ద్వివేదుల నరసింగరావుగారు కూడా తగిన తోడ్పాటు అందించారని విన్నాను.

ఘంటసాల మాస్టారి కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సినీమా వ్యాపారం తమకు అచ్చిరాదనే విషయం తేలిపోయింది. స్వగ్రామంలో తల్లిగారి ఆధ్వర్యంలో కొంత భూవసతి ఏర్పాటుచేసినా కౌలుదార్ల మోసం అనండి, లేక అసమర్ధత అనండి, వాటి మీద వచ్చే ఆదాయం అంత లాభసాటి కాలేదనే భావన అందరిలో వుండేది. 

ఘంటసాల మాస్టారి మిత్రుడు  రామదాసని (ఉణుకూరు అనుకుంటాను) ఒకాయన వేసవికాలంలో మాస్టారిని చూడ్డానికి వచ్చేవారు. ఘంటసాల మాస్టారు చెరువులో ఈతకొడుతున్నట్లు ఒక ఫోటో వుంది. అందులో ఆయన పక్కన వుండేది ఈ రామదాసే. ఆయన మద్రాసు వచ్చినప్పుడల్లా మాస్టారి కోసం తాజాయైన చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. అలాగే ఊరగాయల సీజన్ లో గుంటూరు కారం, శ్రేష్టమైన ఆవపొడి తెచ్చేవారు. సావిత్రమ్మగారు పెట్టే ఆవకాయ, దోసావకాయ, కొరివికారం తల్చుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది. అలాగే  మెంతిమజ్జిగ చేయడంలో కూడా  ఆవిడ ఎక్స్పర్ట్. అవన్నీ రుచి చూసినవాడిలో నేనూ వున్నానడంలో ఏ సందేహమూ లేదు.

రామదాసుగారు తెచ్చే చేబ్రోలు పొగాకును తగు రీతిలో చుట్టలు చేయడంలో మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే భద్రంగారు నైపుణ్యం సంపాదించారు. రావూరి వీరభద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి విద్యార్ధే. ఘంటసాలగారికి బాగా జూనియర్. అందరిలాగే భద్రంగారు కూడా సినీమాలలో పెద్ద గాయకుడు కావాలనే ఆశతోనే వచ్చారు. కానీ అదృష్టం అందరినీ వరించదు. కోరస్ సింగర్ గానే మిగిలిపోయారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక మా ఔట్ హౌస్ డాబామీద ఒక చిన్న కొబ్బరాకుల కప్పున్న ఇంటిలో కొన్నేళ్ళున్నారు. ఆయన మాస్టర్ వేణు దగ్గర హార్మోనియం వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టి మాంగల్యబలం, తోటికోడళ్ళు, వినాయకచవితి సినీమాలలోని పాటలు సాధన చేసేవారు. ఆయన చెప్పే విజయనగరం కబుర్లమీది ఆసక్తితో భద్రంగారు చుట్టలు చుట్టేప్పుడు ఆయనతో కాలక్షేపం చేసేవాడిని. ఆయనకు ప్రసన్న అనే తమ్ముడు. వైజాగ్ ఏ.వి.ఎన్. కాలేజీలోనో, యూనివర్సిటీ కాలేజీలోనో  ఎమ్మే తెలుగు లిటరేచర్ చేసేవాడు. కానీ మధ్యలో చిన్న ప్రేమ వ్యవహారంలోపడి అది సఫలంకాక డిప్రెషన్ లో పడి కొన్నాళ్ళ చదువు సక్రమంగా కొనసాగలేదని భద్రంగారు బాధపడేవారు.

పొగాకు చుట్ట మాస్టారికి వ్యసనం కాదు. అవసరం. రోజుకు మూడు చుట్టలు అవసరపడేవి.  

ఘంటసాల మాస్టారు తమ తమ్ముడికి ఏదో ఆధారం కల్పించాలని చాలా తాపత్రయపడేవారు. తమ్ముడు సదాశివుడుగారు, బావమరది సుబ్బారావు గారూ ఇద్దరు వైజాగ్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఇంటర్ చదివేవారు. అదే సమయంలో ఘంటసాలగారు సొంత సినీమా నిర్మాణం మొదలుపెట్టడంతో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేందుకు వీరిద్దరు ఇంటర్ పూర్తి చేయకుండానే మద్రాసు వచ్చేసారు. ఒకసారి విద్యకు బ్రేక్ పడితే అది ముందుకు సాగడం కష్టమని అందరికీ తెలిసిందే.  

సినీమాలలో వచ్చిన నష్టంనుండి కోలుకునే ప్రయత్నంలో వేరే మరో వ్యాపారం చేయాలి. అన్నగారిలా తమ్ముడు గాయకుడు కాదు. ఇలాటి పరిస్థితులలో వారిని డైరీఫారమ్ బిజినెస్ ఆకర్షించింది. నార్త్ మద్రాస్ శివార్లలోని మాధవరం డైరీ మిల్క్ ప్రోజెక్టులో పాల వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఎన్.టి.రామారావుగారి కజిన్ రమేష్, ఎమ్జీయార్ అన్న చక్రపాణి, గుడివాడ ప్రాంతాలకు చెందిన బాపినీడు, మరికొంతమంది అక్కడ పాల వ్యాపారం చేస్తూవుండడంతో ఘంటసాల మాస్టారు కూడా ఒక పది గేదెలు కొని తమ్ముడిచేత వ్యాపారం మొదలుపెట్టించారు. ఈ పాల వ్యాపారస్తులందరికీ మాధవరం మిల్క్ కాలనీలోనే క్వార్టర్స్ ఇచ్చేవారు. అలాటి ఒక క్వార్టర్ లో తమ్ముడు తాతగారు (సదాశివుడుగారు), మరదలు పాపగారు (సుబ్బలక్ష్మి) కాపురం పెట్టి పాలవ్యాపారం సాగించారు. మేము పిల్లలందరం శని, ఆదివారాలలో మాధవరం మిల్క్ కాలనిలో గడుపుతు అక్కడి మిల్క్ ఫాక్టరీ తీరుతెన్నులు చూసేవాళ్ళం. ప్రశాంతమైన వాతావరణంలో బాబాయి, పిన్నిగార్లతో గడపడం మాకు చాలా ఆనందంగా వుండేది.

ఘంటసాల మాస్టారికి అత్యంత ఆప్తుడు,పానగల్ పార్క్ కాలంనాటి చిరకాల మిత్రుడు అయిన దేవగుప్తాపు రామచంద్రరావు మాస్టారిని, మద్రాసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఆ ఆసక్తికరమైన విషయాలతోపాటూ....

1964 అక్కినేని వారి ఆత్మబలంతో మొదలయి
నాగయ్యగారి రామదాసుతో ముగిసింది. ఈ మధ్యకాలంలో మరెన్నో ఉత్తమ చిత్రాలు. అసంఖ్యాకమైన ఘంటసాల మాస్టారి గాన తరంగాలు. ఆ సినీమా కబుర్లన్నిటితో  మళ్ళా  వచ్చేవారం.....
                       ...సశేషం


Sunday, March 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై మూడవ భాగం

21.03.2021 -  ఆదివారం భాగం - 23*:
అధ్యాయం 2 భాగం 22  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"లవకుశ ప్లాప్ అయిందట" రావమ్మ కబురు. మురుగేశ మొదలియార్ స్ట్రీట్ మొగలోనున్న నాడార్ కట్టెల అడితి దగ్గర గోడకు అంటించివున్న ఏవో తమిళ సినీమా వాల్ పోస్టర్లు చూస్తూంటే చెప్పింది. రావమ్మ చెప్పిన వార్త నాకు రుచించలేదు. కారణం, లవకుశ సంగీతం ఘంటసాలగారిది.

"నీకెలా తెలుసు?" అని కొంచెం కోపంగా అడిగాను. 
"మా నాన్నే చెప్పారు" అని అంది. 
"మీ నాన్నగారు కూడా ఆ సినీమాకు పనిచేశారు కదా! ప్లాప్ అంటున్నావే" అని అడిగాను. 
నా మాటలు రావమ్మకు అర్ధం కాలేదు. ఆ టాపిక్ అక్కడితో ఆపేసి మౌనంగా ఇంటికి వచ్చాము.

ఆ రోజుల్లో ఎవరైనా ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన సినీమాలలోని పాటల గురించి విమర్శించినా, ఆ సినీమాలు ఫెయిల్యూర్ అయాయని పత్రికల్లో వార్తలు చదివినా వాళ్ళమీద విపరీతమైన కోపం వచ్చేది. ఘంటసాల గారు చేసిన సినీమాలు బాగులేవని ఎలా అంటారు అని ఆవేశపడేవాడిని. ఈ రకమైన వార్తలు, విమర్శలను చదివినా, విన్నా కూడా ఘంటసాల మాస్టారిలో పెద్ద ప్రతిస్పందన కనిపించేదికాదు. ఒక చిత్రంలోని పాటలు బహుళ జనాదరణ పొందకపోయినా, ఆ సినీమాలు పరాజయం పొందినా అందుకు అనేక కారణాలుంటాయి. ఏ ఒక్క వ్యక్తివల్లో సినీమా హిట్ కాదు. అందుచేత సినీమా పాటలు/సినీమా జయాపజయాల విషయంలో ఘంటసాల మాస్టారు నిర్లిప్తంగా వ్యవహరించేవారు.   పాటల స్వరరచన విషయంలో తనకు గల ప్రతిభతో అనుభవంతో సంపూర్ణన్యాయం చేకూర్చడానికి తన వంతు కృషి చేసేవారు. మన కర్తవ్యం మనం ఆచరించాలి. జయాపజయాలు దైవాధీనాలు అనే భావం కలిగివుండాలి.  అనుభవ రహితమైన వీరావేశం పొందడంలో, ఉక్రోషపడడంలో ఏమాత్రం అర్ధంలేదని కొంత వయసు,ఆలోచనాపరిధి పెరిగాక గానీ తెలిసిరాలేదు. సినీమా ప్రపంచంలోని నటీనటులు, గాయకులు, దర్శకులు,  సమాజంలోని ప్రముఖ వ్యక్తుల విషయంలో ఆరాధన, గౌరవాభిమానాలు కలిగివుండవచ్చు. వారిని తమ ఆదర్శ పురుషులుగా స్వీకరించవచ్చును. వారిగురించి తమ ప్రేమాభిమానాలను తమకు తోచినవిధంగా ప్రకటించుకోవచ్చు. తప్పులేదు. కానీ తన భావాలే, అభిప్రాయాలే ఇతరులు కూడా కలిగివుండాలని నిర్బంధించడం సమంజసం కాదు.

తన అభిమానులు, అభిమాన సంఘప్రతినిధులమంటూ వచ్చేవారందరికీ ఘంటసాల మాస్టారు ఒకే మాట చెప్పేవారు. ఉత్తమమైన సంగీతాన్ని ఎవరు పాడినా మెచ్చుకోవాలి. ఆదరించాలి. వారిని గౌరవించడం తెలుసుకోవాలి. అభిమానం పేరిట దురభిమానం పెంచి మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించకూడదని హితవు పలికేవారు.  

సరి, ఇక లవకుశ విషయానికి వద్దాము. 

లవకుశ సినీమాను తెలుపు నలుపులలో 1934లో ఈస్టిండియా కంపెనీ వారు మొదటిసారి గా తీశారు. సీనియర్ శ్రీరంజని సీతగా, పారుపల్లి సుబ్బారావు రాముడుగా నటించారు. ఆ చిత్రానికి దర్శకుడు సి.పుల్లయ్య. ఆ లవకుశ సినీమా తెలుగునాట పెద్ద ప్రభంజనం సృష్టించింది. శ్రీరంజనిని అభినవ సీతగా అందలమెక్కించి ఆరాధించారు.  అదే ఉత్తర రామచరిత్ర కధను మరల పాతిక సంవత్సరాల తర్వాత ఎ.శంకరరెడ్డి రంగులలో ఎన్ టి రామారావు , అంజలీదేవిలతో తీయ సంకల్పించారు. బహుశా దీనికి బీజం తాను తీసిన చరణదాసి సినీమాలోనే పడిందేమో. ఆ సినిమాలో వచ్చే ఒక డ్రీమ్ సీక్వెన్స్ లో ఎన్.టి.ఆర్ రాముడిగా, అంజలీదేవి సీతగా ఒక యుగళగీతాన్ని (మురిసేను లోకాలు కనుమా") ఆలపిస్తారు. అదే పి.సుశీల, ఘంటసాల మాస్టారు (ఇద్దరు మాత్రమే) తొలి పూర్తి యుగళగీతంగా చెపుతారు.



ఈ సినీమా విడుదలైన మరుసటి సంవత్సరమే "లవకుశ" సినీమా రంగులలో తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిర్మాత శంకరరెడ్డి. పాత లవకుశ డైరక్ట్ చేసిన సి. పుల్లయ్యగారే దర్శకుడు. తెలుగు తమిళ భాషలలో మొదలుపెట్టారు. రెండు భాషలలో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. సముద్రాల సీనీయర్ పాటలు.  ప్రసిధ్ధి పొందిన రామాయణ కధావస్తువుగా ఈ సినీమాలో సంగీతం ప్రధానపాత్ర వహించింది. ఘంటసాల మాస్టారు 'మాస్టర్' గౌరవానికి తనను మించినవారు లేరని నిరూపించుకున్నారు. సినీమాలో అధికశాతం  పాటలు, పద్యాలు, రీరికార్డింగే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లవకుశ చిత్ర నిర్మాణం ఏమాత్రం సులభంగా సాగలేదు. భారీసెట్లతో,  రంగుల చిత్రంకావడంతో అనుకున్నదానికంటే బడ్జెట్  పెరిగిపోయింది. సమయానికి తగినంత డబ్బు లభించక కాలాయాపనజరిగింది. తెలుగు,తమిళంలో నటించిన బాలనటులు ఎదగడం ప్రారంభించడంతో కంటిన్యుటీ ఇబ్బంది ఏర్పడింది. తమిళం అయితే లవకుశులలో లవుడి పాత్రను ఉమ అనే అమ్మాయివేసింది. సినీమా నిర్మాణం ఐదేళ్ళు సాగడంతో ఆ ఉమ రూపురేఖల్లో బాగా మార్పు కనిపిస్తుంది.

ముందు తమిళ భాష కు కూడా ఘంటసాలవారినే సంగీత దర్శకుడి నియమించుకున్నారు. మాస్టారు కొన్ని తెలుగు వరసల పాటలనే తమిళంలో కూడా స్వరపర్చారు. కానీ, తమిళం వెర్షన్ కు స్థానికంగా బాగా పాప్యులర్ అయిన తమ సంగీతదర్శకుడు వుంటేనే ఫైనాన్స్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేయడంతో సగం సినీమా అయ్యాక కె.వి,మహాదేవన్ ను తమిళానికి సంగీత దర్శకుడిగా నియమించారు. తెలుగులో పి.లీల, పి.సుశీల పాడిన మూడు రామాయణ గీతాలను కె.వి.మహాదేవన్ తన సొంత బాణీలో స్వరపర్చడం జరిగింది. 

ఒక దశలో సినీమా అసలు పూర్తి అవుతుందా లేదా అనే అనుమానం కలిగించింది. దీనికి తోడు సి. పుల్లయ్యగారి అనారోగ్యం కారణంగా దర్శకుడిగా ఆయనకు బదులుగా ఆయన కుమారుడు సి.ఎస్. రావు కొనసాగారు. చిట్టచివరకు శంకరరెడ్డి చిత్ర నిర్మాణం పూర్తి చేయలేక నెగెటివ్ రైట్స్ ను పూర్తిగా సుందర్లాల్ నహతాకు అమ్మివేసి, అష్టకష్టాలు పడి 1963 లో సినీమా విడుదల చేశారు. 

తెలుగులో మొట్టమొదటి గేవాకలర్ చిత్రం 'లవకుశ' ఘంటసాల సంగీతం, పి.ఎల్.రాయ్ కెమెరా పనితనం, టివిఎస్ శర్మ ఆర్ట్ డైరక్షన్ లవకుశ సినీమాకు గొప్ప ఎసెట్. లవకుశ సినీమా రీరికార్డింగ్ ఆద్యంతం చూసే అవకాశం కలిగింది. లవకుశ సినీమాలో వచ్చే నేపథ్యసంగీతం సినీమాకు ఎంతో పరిపూర్ణతను, విశిష్టతను చేకూర్చింది. ఈ సినీమాలోని ప్రతీ పాట, పద్యం, ఘంటసాలవారి సంగీత వైదుష్యానికి గీటురాళ్ళు. నాలుగు గంటలకు పైగా సాగే  లవకుశ చిత్రానికి సంగీతమే ప్రాణం అనడం సత్యదూరం కాదు. సినీమా విడుదలైన రెండు వారాల కలెక్షన్ నిరాశాజనకంగానే వుండి సినీమా ఫెయిలనే నిర్ణయానికి వచ్చే సమయంలో, ఒక్కసారిగా అనూహ్యంగా లవకుశ దశ మారిపోయింది. క్రమక్రమంగా కలెక్షన్స్ పెరిగి విజయబాటలో సాగింది. చిన్నా పెద్దా అన్ని సెంటర్లలో విజయదుందుభి మ్రోగించింది. మొదటి రన్ లోనే తెలుగులో కోటి రూపాయలు ఆర్జించిన మొట్టమొదటి గేవాకలర్ రంగుల సినీమా లవకుశ. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. తమిళం లవకుశ కూడా విజయవంతమైన సినీమాగానే నమోదు అయింది.

1934 నాటి సినీమాకు ఎంత ఆదరణ లభించిందో ఈ కొత్త లవకుశ కు అంతకు రెట్టింపు కీర్తి ప్రతిష్టలు లభించాయి. పల్లె పల్లెల నుండి ఎడ్లబళ్ళమీద బంధు, మిత్ర కుటుంబసమేతంగా లవకుశ చిత్రం చూడడానికి ప్రజలు తరలివెళ్ళడం జరిగింది. మా బొబ్బిలి లో లవకుశ ఆడినన్నాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలోని మా కుటుంబ మిత్రులంతా సినీమా చూసివచ్చి మా ఇంట్లోనే పడుక్కొని మర్నాడు ఉదయం బళ్ళమీద తిరిగివెళ్ళేవారు.

సీతారాములుగా అంజలిదేవీ, ఎన్.టి.రామారావుల ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీరాముడి గెటప్ లోని ఎన్.టి.ఆర్ ఫోటోలు తెలుగునాట  చాలామంది ఇళ్ళ పూజాగృహాలలో చోటు చేసుకున్నాయి. సీతమ్మ అంటే అంజలీదేవే అనే భావన ఈ చిత్రం కలిగించింది. తెలుగు భాష సజీవంగా వున్నంతవరకూ లవకుశ సంగీతం వినిపిస్తూనే వుంటుంది. పి.లీల, పి.సుశీలగార్ల గాన ప్రతిభకు దర్పణం లవకుశ. వారి గానానికి చిత్రిక పట్టి మెరుగుదిద్దిన ఘంటసాల స్టారి పేరు చిరస్థాయిగా నిలిచేవుంటుంది. 




ఒక అద్భుత కళాఖండం నిర్మించిన నిర్మాతగా ఎ.శంకరరెడ్డి గారికిపేరు మాత్రమే మిగిలింది. ఆ సినీమా లాభాలలో ఒక్క పైసా కూడా ఆయనకు దక్కకపోవడం చాలా విచారకరం. 
చిత్రం! భళారే విచిత్రం!

1940-1960ల మధ్య శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ అతి పెద్ద చిత్రనిర్మాణ సంస్థగా ఒక వెలుగు వెలిగింది. సుప్రసిద్ధ బహుభాషా నటీమణి పి.కన్నాంబ, ఆమె భర్త, చిత్ర దర్శకుడు కడారు నాగభూషణం ఈ సంస్థ అధినేతలు. వీరి నిర్మాణంలో దాదాపు పాతిక సినీమాలు తెలుగు, తమిళ భాషలలో నిర్మాణమయ్యాయి. అయితే అవేవీ ఈ తరానికి తెలిసినవి కావు. అధికశాతం పౌరాణికాలే. కన్నాంబ నట-గాయని. తమిళంలో అనర్గళంగా పేజీలకు పేజీలు తెరమీద మాటల తూటాలతో ప్రేక్షకులను అదరగొట్టిన గొప్ప నటి. తెలుగులో పల్నాటియుధ్ధం , తమిళంలో కణ్ణగి, హరిశ్చంద్ర, మనోహర వంటి చిత్రాలు కేవలం ఒక చిన్న ఉదాహరణకు మాత్రమే. 
పల్నాటియుధ్ధం లో ఘంటసాల మాస్టారు కన్నాంబతో కలసి "తెర తీయగరాదా" అనే పాటను గానం చేసిన సంగతి అందరికీ తెలుసు. 

శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ తీసిన సినీమాలలో చెప్పుకోతగిన పాటలేవీ మాస్టారు ఎక్కువగా పాడలేదు. రాజేశ్వరి కన్నాంబ, నాగభూషణంల పెంపుడుకూతురు. ఆమె పేరుమీదే చాలా చిత్రాలు నిర్మించారు. రాజేశ్వరి ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు మొదటి భార్య. ఈమెను విడచిపెట్టి సినీ నటి రాజసులోచనను పెళ్ళి చేసుకున్నారు. ఈ సంఘటన కన్నాంబ దంపతులను మానసికంగా, శారీరకంగా చాలా కృంగదీసింది. తరువాత, ఆర్ధికంగా కూడా అనేక ఇబ్బందులకు గురిఅయ్యారు. అలాటి సమయంలో చేపట్టిన సినీమా 'ఆప్తమిత్రులు'. కడారు నాగభూషణంగారే డైరక్టర్. ఈ సినీమాకు ఘంటసాల వారిని సంగీతదర్శకుడిగా నియమించుకోవడం నేను ఎదురుచూడని విషయం. ఆప్తమిత్రులు గొప్ప సినీమాయేం కాదు కానీ, ఇందులో మనసుకు హాయిని కలిగించే కొన్నిపాటలను ఘంటసాల మాస్టారు స్వరపర్చి చిత్రానికి బలం చేకూర్చారు. "రావే చెలీ ఈవేళా", "పవనా మదనుడేడా మరలిరాడా", "దయరాదా నామీదా యశోదా ప్రమోదా", "ఈ లోకమూ మహా మోసమూ" వంటి పాటలు జనాదరణ పొందాయి.

"ఆప్తమిత్రులు" ఆర్ధికంగా కన్నాంబ దంపతులను ఎంతవరకు ఆదుకున్నారో తెలియదు. 1964లో కన్నాంబ కాలధర్మం చెందడంతో కడారు నాగభూషణం మరింత దిగజారిపోయారు. ఎమ్జీయార్ తో "తాళిబాగియం"( తాళి భాగ్యం) అనే ఒక తమిళ సినీమా మొదలుపెట్టి అది పూర్తిచేయడానికి అప్పులపాలై, ఉన్న ఆస్తులన్నీ అమ్మివేసి సినిమా పూర్తిచేశారు. ఇక్కడితో ఒక ప్రముఖ చలనచిత్ర సంస్థ చరిత్ర ముగిసింది. 

నిలువ నీడలేక కడారు నాగభూషణం అక్షరాలా రోడ్ న పడ్డారు. ఆయన అంటే గౌరవాభిమానం కల కొంతమంది సహాయంతో ఉస్మాన్ రోడ్ లో, మా ఇంటికి సమీపంలో పానగల్ పార్క్ కు వెళ్ళే త్రోవలో వాసన్ స్ట్రీట్ దాటాక 'మీనాక్షీ లాడ్జ్' అనే అతి సాదా లాడ్జింగ్ హోటల్ లో ఒక చిన్న గదిలో కాలం గడిపారు. రాజభవనం లాంటి పెద్ద భవంతిలో భోగభాగ్యాలతో అతి పెద్ద కార్లలో తిరుగాడిన కడారు నాగభూషణంగారి అంతిమ దినాలు ఒక చిన్న గదిలో ముగిసాయి. లాంఛనప్రాయంగా చిత్రసీమ శోకించింది. పలువురు ప్రముఖులు సంతాపం జరిపి ఆయనకు నివాళులు అర్పించారు.  అక్కడితో సరి. ఒక  ప్రముఖ దర్శక నిర్మాత కథ ముగిసింది.

1934లో సోమసుంద‌రం, ఎస్.కె.మొహిదీన్ లు భాగస్వాములుగా ఏర్పడి కోయంబత్తూరు లో జూపిటర్ పిక్చర్స్ ను ప్రార్ంభించారు 1940-50ల మధ్య అక్కడి సెంట్రల్ స్టూడియోలో దాదాపు 40 సినీమాలు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో నిర్మించారు. ఎక్కువగా ఎమ్జీయార్ తోనే తీశారు. అన్ని హిట్ సినీమాలే. సెంట్రల్ స్టూడియో మూతబడ్డాక తమ సంస్థను మద్రాసు కు తరలించి నెప్ట్యూన్ స్టూడియోలో అనేక సినీమాలు తీశారు. ఈ నెప్ట్యూన్ స్టూడియోను ఎమ్జీయార్ కొనుగోలు చేసి తల్లి సత్యభామ పేరిట సత్యా స్టూడియోస్ గా మార్చి తన చిత్రాలు అక్కడ నిర్మించారు. అడయార్ రివర్ బ్రిడ్జ్ కు ముందు ఆంధ్ర మహిళా సభ కు ఎదురుగా వుండే ఈ సత్యా స్టూడియో ఎమ్జీయార్ మరణానంతరం ఒక విద్యాలయంగా ఎమ్జీయార్-జానకి ఉమెన్స్ కాలేజీగా రూపుదిద్దుకున్నది.

జూపిటర్ పిక్చర్స్ కు మన ఘంటసాల మాస్టారికి గతంలో పెద్ద సంపర్కం వున్న గుర్తులేదు. జూపిటర్ తీసిన పాత సినీమాలలో మాస్టారు పాడారా అనేది సందేహమే. పాడిన అతి తక్కువ సంఖ్యలో పాడివుండాలి. వివరాలు తెలియవు. ఆ సంస్థ భాగస్వామి కుమారుడు ఎస్ కె హబిబుల్లా. ఆయన తెలుగులో వరసగా రెండు సినీమాలు తీశారు. ఒకటి వాల్మీకి (తెలుగు, కన్నడం), మరొకటి మర్మయోగి. ఈ రెండు చిత్రాలలో హీరో ఎన్.టి.రామారావు. ఈ రెండు చిత్రాలకు ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించడం నాకు ఆశ్చర్యమే. ఈ సినీమాల సమయంలోనే మొదటిసారిగా వాల్మీకి రీరికార్డింగ్ కు జూపిటర్ (నెప్ట్యూన్) స్టూడియో లోపలికి వెళ్ళడం జరిగింది.

రామాయణాన్ని వ్రాసిన ఆదికవిగా,  అడవులు పట్టిన సీతకు ఆశ్రయమిచ్చి లవకుశులను పెంచిన వాల్మీకి మహర్షిగానే ఆయన వృత్తాంతం మనకు తెలుసు. వాల్మీకి మహర్షి కావడానికి ముందుగల గాధను ఒకటి తయారు చేసి ఒక జానపద-పౌరాణిక చిత్రంగా జూపిటర్ పిక్చర్స్ వారు తీసారు. పౌరాణిక, జానపద చిత్రాలకు కావలసిన శాస్త్రీయ, లలిత సంగీత పరిజ్ఞానం ఘంటసాల మాస్టారికి వున్నంతగా ఇతరులకు లేదంటే తప్పు పట్టరనే భావిస్తాను. ఆ కారణం చేతనే వాల్మీకి చిత్రం  మాస్టారికి లభించిందనుకుంటాను. వాల్మీకిలో చాలానే పాటలు పద్యాలు వున్నాయి. ప్రముఖ రంగస్థల నటుడు కె. రఘురామయ్య ఈ చిత్రంలో నారదుడు. రఘురామయ్య పాటంటే అభిమానించే తెలుగు ప్రేక్షకులు అనేకం. ఆయన బాణీకి తగినట్లుగా మాస్టారు కొన్ని పాటలను పద్యాలను రఘురామయ్య చేత పాడించి రక్తికట్టించారు. వాల్మీకికి మాస్టారు పాడిన పాటలు, పద్యాలు వారి గాన ప్రతిభను వెల్లడిస్తాయి.

వాల్మీకి కృతమైన "మా నిషాద ప్రతిష్టాం త్వమగః శాశ్వతీః సమాః" అనే శ్లోకాన్ని, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం"  అనే శ్లోకాన్ని ఘంటసాల వారు గానం చేసిన తీరు నభూతో నభవిష్యతి. "శ్రీ రామాయణ కావ్య కథ", "హరియే వెలయునుగా", "జయ జయ జయ నటరాజా" వంటి శాస్త్రీయ గీతాలను స్వరపర్చడం, గానం చేయడం వారికే చెల్లు. 




హైదరాబాద్ లో శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతుల సమక్షంలో "గిరిజా కళ్యాణం" యక్షగానం గానం చేసిన సమయంలో ముందుగా ఈ వాల్మీకి చిత్రంలోని "జయ జయ జయ నటరాజా" పాటను కూడా కొంతచేర్చి పాడడం జరిగింది. రామాయణ గాధలకు సంగీతం నిర్వహించడంలో తనకు తానే సాటియని వాల్మీకి చిత్రం ద్వారా ఘంటసాలగారు మరోసారి నిరూపించుకున్నారు. 




ఘంటసాలవారు సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అయిన సుందర్లాల్ నహతా గారి ఆస్థాన సంగీత దర్శకుడు. తొలి చిత్రమైన 'జయం మనదే' మొదలుకొని 'వీరకేసరి' (కన్నడం) వరకు వరసగా ఎనిమిది సంవత్సరాలలో 10 సినీమాలకు సంగీత దర్శకత్వం వహించి ఆ రోజుల్లో ఒక చరిత్రే సృష్టించారు. రాజశ్రీ , శ్రీ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఈ చిత్రాలన్నీ నిర్మించబడ్డాయి. సుందర్లాల్ గారు టి. అశ్వత్థ నారాయణ భాగస్వామ్యం లో కొన్ని చిత్రాలు, పోతిన డూండేశ్వరరావు భాగస్వామ్యంలో కొన్ని చిత్రాలు నిర్మించారు. ఈ సినీమాలలో అధిక సంఖ్యాకం ఇతర భాషలలో విజయవంతమైన సినీమాలనే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో తీసి విజయంపొందారు. సుందర్లాల్ నహతాగారి సినీమాలలో అపజయం పొందినవి చాలా తక్కువ. సినీమా వ్యాపారాన్ని కాచి వడపోసిన వ్యక్తి. సినీమా విజయమే ఆదర్శం, లక్ష్యం. ఆ దృక్పథంతోనే సినీమా నిర్మాణం నిర్దిష్టంగా, పక్కా ప్లాన్ తో సాగేది. వెంటవెంటనే సినీమాలు తీసే దిట్ట నహతాగారు. నహతాగారి సినీమాలలో అధికసంఖ్యాకం పాటలు పరభాషా చిత్రాల్లోని పాటలుగానే వుండేవి. ఒక మూడు, నాలుగు పాటలు మాత్రం ఘంటసాల మాస్టారి సొంత బాణీలు. 

అలాటి సుందర్లాల్ నహతా గారికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి  తెలుగు చిత్రం ' బందిపోటు'.  బి.విఠలాచారి దర్శకుడు. దెయ్యాలు, పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు లేని జానపదం. రాజశ్రీకి ఘంటసాల మాస్టారు సంగీతం నిర్వహించిన తొలి చిత్రం 'జయం మనదే' కూడా జానపదమే. ఈ రెండూ rich versus poor రాచరికపు అమానుషాలను ఎదుర్కొనే సామాన్య వీరుడు కథానాయకుడు. మధ్యలో ప్రేమోపాఖ్యానం. సామాన్య ప్రేక్షకుడు చూసి ఆనందించడానికి కావలసిన సరంజామా అంతా బందిపోటులో కనిపిస్తుంది. హీరో ఎన్.టి.ఆర్ కు ఇలాటి సినీమాలు నల్లేరుమీద బండే. దర్శకుడు బి.విఠలాచార్య, సంగీత దర్శకుడు ఘంటసాల కలసి పనిచేసిన తొలి చిత్రం 'బందిపోటు'. ఈ సినీమాలోని క్లైమాక్స్ సీన్ ను కలర్ లో చిత్రీకరించారు. సంగీతం విషయంలో దర్శకుడు విఠలాచారిగారి సరళి, సంగీత దర్శకుడు ఘంటసాలవారి సరళి పరస్పర విరుధ్ధం. ఒకరిది ఉధృతంగా ఉరుకుతూ పరుగులుతీసే జలపాతమైతే, మరొకరిది గంభీరంగా, నిదానంగా ఒంపుసొంపులు తిరుగుతూ ప్రవహించే జీవనది. 'బందిపోటు' చిత్రంలో ఉన్న ఏడు పాటలు స్వఛ్ఛమైనవి. పరభాషా గీతాల ప్రభావం లేనివి. ఏడింట్లో  'వగల రాణివి నీవే' మాత్రమే మాస్టారి సోలో. ఒకటి లీల బృందం, మిగిలినవన్నీ పిసుశీలతో, పి.లీలతో పాడిన డ్యూయెట్లే. "ఓ అంటే తెలియని ఓ దేవయ్యా" పాట ఒక మంచి నృత్యగీతం.


కొసరాజుగారి సెటైర్ బాగా వినిపిస్తుంది. ఈ పాటను మాస్టారు, సుశీల పోటీపడి ఆలపించారు. చాలా మంచి పాట. పాట చిత్రీకరణ ఎంతో బాగుంటుంది. పాట చివర్లో వచ్చే మాస్టారి ఆలాప్ ఆ పాటకే హైలైట్. ఈ సినీమాలో నాలుగు పాటలలో కోరస్ వారికి మంచి అవకాశం కల్పించారు ఘంటసాల. బందిపోటు సినీమాకే తలమానికంగా,ఈనాటి వరకూ ఎల్లప్పూడూ అందరినీ అలరిస్తున్న పాట "ఊహలు గుసగుసలాడే". ఈ పాట వరస, టెంపో దర్శకుడు విఠలాచారిగారికి నచ్చలేదు. పాటంతా మరింత హడావుడిగా ఉద్రేకభరితంగా వుండాలని పట్టుబట్టారు. కానీ, ఘంటసాల మాస్టారు ఈ పాట విషయంలో రాజీపడలేదు.  ఘంటసాల మాస్టారి ట్యూనే చివరకు ఓకె అయింది.  సినీమా విడుదలయ్యాక ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు. కన్నడం వీరకేసరి లో కూడా ఈ పాట సూపర్ హిట్ అయింది. సాధారణంగా, సన్నివేశాన్నిబట్టి ఫలానా పాట ఫలానా రాగంలో చేస్తే సముచితంగా వుంటుందని నిర్ణయించుకొని చేసే పాటలు కొన్ని అయితే, రాగ నిర్ణయం లేకుండా చేసే పాటలు కొన్ని వుంటాయి. ఆ రకమైన పాట "ఊహలు గుసగుసలాడే". ఆరోహణా, అవరోహణా క్రమంలో ఉండవలసిన స్వరాలన్నీ వున్నాయి. ఈ స్వరాలున్న రాగం ఏదై వుంటుందనే జిజ్ఞాస  మా నాన్నగారికి చాలా కాలం తరవాత కలిగి తన దగ్గరున్న సంగీత గ్రంథాలు తిరగేసి చూస్తే "ఊహలు గుసగుసలాడే" పాటలోని స్వరాలు ఓ రెండు రాగాలకు పోలి వున్నాయి. అవి ఒకటి సౌదామిని అనే రాగం. మరొకటి సుమనేశరంజని అనే రాగం. ఈ రెండూ సినీమాలకు సంబంధించినంతవరకూ అపూర్వరాగాలే. గతంలో ఏ సంగీతదర్శకుడు ఏ సినీమాలోనూ ఉపయోగించలేదు. సౌదామిని రాగంలో ఒకే ఒక కృతి త్యాగయ్యగారిది వుందట. ఈ "ఊహలు గుసగుసలాడే" పాటంతా సౌదామిని రాగంలో ఉంటుంది. చరణాలలో మాత్రం ఒక దగ్గర అన్యస్వర - కాకలినిషాద ప్రయోగంతో సుమనేశరంజని చాయలుంటాయి. ఈ రెండు రాగాలకు సంబంధించిన వివరాలను మా నాన్నగారు (సంగీతరావుగారు) తన వ్యాసాలలోనూ, ఘంటసాల మాస్టారి భగవద్గీత రాగ విశ్లేషణలోనూ తెలియజేశారు.


 
గతంలో కూడా పాత సినీమాలలో "చారుకేశి", "చక్రవాకం", "రాగేశ్వరి" వంటి అరుదైన రాగాలను సమర్ధవంతంగా సినీమాలలో ప్రవేశపెట్టి ఆ గీతాలకు అజరామరత్వం కల్పించిన ఘనతకూడా మన గానగంధర్వుడు ఘంటసాల మాస్టారిదే. ఘంటసాల గాన విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు వున్న ప్రసారమాధ్యమాలు ఆనాడు వుండివుంటే ఘంటసాలవారి కీర్తిప్రతిష్టలు మరింతగా దిగంతాలకు ప్రాకివుండేది. మరెన్నో ఆణిముత్యాలు మనకు అందుబాటులో ఉండేవి.

"నీ పెళ్ళికి నా కచేరీ ఏర్పాటు చెయ్యి. అప్పుడు వచ్చి పాడతాను...."ఎవరు ఎవరితో అన్నారు?

వివరాలు వచ్చేవారం నెం.35, ఉస్మాన్ రోడ్ లో...
                       ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, March 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై రెండవ భాగం

14.03.2021 - ఆదివారం భాగం - 22:
అధ్యాయం 2  భాగం 21 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకానొకప్పుడు అంటే 1970లకు ముందు దక్షిణాది సినీమా పరిశ్రమ యావత్తు మెడ్రాస్ లోనే వుండేది. (క్రమేణా, తెలుగు సినిమా హైదరాబాద్ కు, కన్నడ సినీమాలు మైసూర్, బెంగుళూర్ కు, మలయాళం సినీమా త్రివేండ్రమ్  కు తరలి వెళ్ళిపోవడంతో మెడ్రాస్ సినీ పరిశ్రమ కాంతిహీనమైపోయింది.)

జెమినీ, AVMలు తీసే హిందీ సినీమాలు కూడా మెడ్రాస్ లోనే.  జెమినీ, జూపిటర్ వంటి సినీమా స్టూడియోలు తప్ప మిగిలినవన్నీ కోడంబాక్కం, వడపళని చుట్టుపక్కల ప్రాంతాల్లో వుండేవి. అయితే సినీమా నిర్మాణ సంస్థలు అధిక భాగం టి.నగర్ ఏరీయాలోనే వుండేవి. అందుచేత సినీమాలలో హీరోలైపోదామని వచ్చే ఔత్సాహిక నటులు, ఎప్పుడో ముగిసిపోయిన తమ పనికి రావలసిన పారితోషికం కోసం సినీమా ఆఫీసులు చుట్టూ తిరిగే జూనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తరచు మా ఉస్మాన్ రోడ్ లో కనిపించేవారు. 

నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న సమయం కన్నా పోర్టికోలోనో లేక గేటు బయట గడిపే సమయమే ఎక్కువ.  అలాటి సమయంలో మా రోడ్ లో ఎంతోమంది సినీమా నటులు కనిపించేవారు. కొంతమంది నటులు ఎన్నో సినీమాల్లో సూట్, బూట్లతో దర్జాగా పైపులు, సిగరెట్లు కాలుస్తూ లక్షాధికారులు లాగా కనిపిస్తారు. వారి నిజజీవితంలో కూడా అలాగే వుంటారనే భ్రమలో వుండేవాడిని. అలాటివారంతా పానగల్ పార్క్ ఏరియాలో చాలా సాదా సీదాగా నడిచిపోతుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. టి.ఆర్.రామచంద్రన్, వి.కె.రామస్వామి, సహస్రనామం వంటి తమిళనటులూ కనిపించేవారు.  ఒక సాదా పంచె, మల్లు బనీన్ లాటి చొక్కా, చంకన గొడుగుతో, కాలినడకన  బడుగు బాపనకు దర్పణంగా  వంగర వెంకట సుబ్బయ్య కనిపించేవారు. సినీమాలో ఎలావుండేవారో, బయటా అలాగే వుండేవారు. సీతారాం, నల్లరామ్మూర్తి, జి.ఎన్ స్వామి కనిపించేవారు. ఒక పెద్ద స్టార్ హీరోకు మామగారు, తెలుగు సినీపరిశ్రమనే అజమాయిషీ చేసే స్థితికి ఎదిగిన అనేక సూపర్ హిట్ సినీమాల నిర్మాతకు తండ్రి, అంతకుమించి వందలాది సినీమాలలో హాస్యనటుడిగా పేరు పొందిన అల్లు రామలింగయ్య తన తొలిరోజులలో చాలా సామాన్యంగా సైకిల్ మీద వెడుతూ కనిపించేవారు. అప్పట్లో చిన్న చిన్న సినిమా వేషాలతోపాటు హోమియో వైద్యం కూడా చేసేవారట. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించినది ఒకప్పటి నెంబర్ వన్ కమేడియన్ కస్తూరి శివరావు. హీరోలతో సమానమైన హోదాను అనుభవించిన నటుడు. ఒక పెద్ద బ్యూక్ సొంతదారుడు. చిత్రనిర్మాత  కూడా. 

కొంతమంది జీవితాలు ఎందరికో ఆదర్శంగానూ గుణపాఠాలు గానూ అమరుతూంటాయి. అలాటివారిలో ఉదాహరణగా  కస్తూరి శివరావును, చిత్తూర్ వి.నాగయ్యగారిని సినీమాలోకం లో చెప్పుకుంటారు.

1950 -60 ల మధ్య అనేక హిట్ సినీమాలలో నటించి ఒక ఐకాన్ గా గుర్తింపు పొందిన నటుడు కస్తూరి శివరావు. ఆయన అంతిమ జీవితం చాలా దుర్భరంగా సాగింది. ఎన్.టి.రామారావు ఇంటికి పక్కన ఒక పాత ఇంటిలో చాలా దీనస్థితిలో వుండేవారు. కాలం ఖర్మం కలసిరాకపోతే కోటీశ్వరుడు కూడా పూరి గుడిసెల్లో వుండవలసినదే. శివరావు పరిస్థితి అదే.  మాసిపోయిన షెరాయి, జుబ్బాతో, చింపిరిజుట్టుతో ఒక పాత పాడైపోయిన సైకిల్ మీద మా ఇంటిమీదుగా వెళ్ళడం చాలాసార్లు చూశాను.  మా ఇంటి సమీపంలోనే సైకిల్ టైర్ పంచర్ అయి ఒకసారి, చైన్ ఊడిపోయి మరొకసారి, సైకిల్ ను తోసుకుంటూ వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అప్పట్లో చిన్నతనం కారణంగా నాకేమీ అనిపించలేదు. కానీ ఒక వయసు వచ్చాక, ఆ నటుడి గత వైభవం గురించి తెలిసాక మాత్రం, అతని గురించి తల్చుకుంటే మనసు బరువెక్కిపోతుంది. 

'ఇండియన్ పాల్ముని' గా ప్రసిధ్ధి పొందిన బహుభాషా చిత్రనటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, ఎంతో మంది నటీనటులకు మార్గదర్శి చిత్తూర్ వి.నాగయ్య చలనచిత్ర జీవిత చరిత్ర అందరికీ తెలిసినదే. ఎంత వైభవంగా జీవించారో, అంత దైన్యంగా అంతిమ జీవితం గడచింది. తాను చిత్రనిర్మాతగా వున్నప్పుడు ఆయన రేణుకా ఆఫీస్ ఒక ధర్మసత్రంలా వుండేదట. ఆయన సినీమాతో సంబంధం వున్నవారూ, లేనివారూ కూడా అక్కడకు వచ్చి ముప్పొద్దులా సుష్టుగా భోజనం చేసి వెళ్ళేవారట. ఆకలితో ఎవరు వచ్చినా ఆదరించిపంపేవారట. నాగయ్యగారు నటించిన పాత్రల ప్రభావం ఆయనమీదే వుండేదనిపిస్తుంది. నాగయ్యగారు అందరిమీదా అమితమైన జాలి, ప్రేమ కనపర్చేవారు. తనకు మాలిన ధర్మంగా అప్పులు చేసి అన్నదానాలు చేసారు. ఆయన చేపట్టిన 'రామదాసు' చిత్రనిర్మాణం ఆర్ధిక ఇబ్బందులవల్ల పూర్తయి విడుదల కావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శివాజీ గణేశన్, అంజలీదేవి నాగయ్యగారి మీద గౌరవాభిమానాలతో ఉచితంగా నటించి చిత్రం పూర్తికావడానికి ఇతోధిక సహాయం చేసారు. కానీ, రామదాసు చిత్రం పరాజయం పొందడంతో నాగయ్యగారి పరిస్థితి మరింత దిగజారింది. నిజజీవితంలో కూడా 'ఏ తీరున నను దయ చూచెదవో ఇనకులోత్తమ రామా' అని అతి దైన్యంగా పాడుకోవలసిన స్థితికి దిగజారిపోయారు. పైగా వృధ్ధాప్యం. చేతిలో తగినన్ని మంచి వేషాలు లేకపోవడంతో మా ఇంటి ఎదురు వీధైన వ్యాసారావు స్ట్రీట్ లోని నెం. 11 ఇంటిని అమ్మివేసి (నటుడు రమణారెడ్డి కొనుకున్నారు).

పానగల్ పార్క్ సమీపంలోని దొరైసామీ రోడ్ కు ఆనుకొనివుండే ఒక చిన్న సందులోని అద్దె ఇంటికి మారారు. వారు ఆ యింటిలో వున్నప్పుడు ఏవో సందర్భాలలో రెండు మూడుసార్లు వెళ్ళి కలియడం జరిగింది. వ్యక్తిగా, నటుడిగా నాగయ్యగారి మీది గౌరవంతో సాటి నటులు, దర్శక నిర్మాతలు తమ చిత్రాలలో తండ్రి పాత్రలకు తీసుకొని ఆదుకునేవారు. అలాటి పరిస్థితులలో కూడా కొందరు ఆయనను అవాంఛనీయ అవమానాలకు గురిచేసేవారని చెప్పుకోవడం వుంది. ఘంటసాల మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే ప్రముఖ వైలినిస్ట్ వై.ఎన్.శర్మగారి (సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి) ఇల్లు కూడా నాగయ్యగారింటి సమీపంలోనే వుండేది. శాస్త్రీయ సంగీత కచేరీలకు, సాంస్కృతికోత్సవాలకు ప్రసిధ్ధిపొందిన 'వాణీ మహల్' ఆడిటోరియంను, శ్రీ  త్యాగబ్రహ్మ గాన సభను స్థాపించినది నాగయ్యగారే. నాగయ్యగారు దివంగతులైనాక ఆయనంటే విపరీతమైన అభిమానం చూపించే ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు ('సినీమా' వార పత్రిక) మరికొంతమంది పాత్రికేయులు, ప్రముఖులు కలసి నాగయ్య విగ్రహ ప్రతిష్టాపన చేసారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అంత సజావుగా సాగలేదు. ఆ విగ్రహం కొన్నాళ్ళు పానగల్ పార్క్ లో ఈశాన్యమూలన ఉండేది. 

1935-57 మధ్య కాలంలో తన హాస్య నటనతో, వ్యంగ్యాత్మక, సందేశాత్మక గీతాలతో  తమిళదేశాన్ని ఒక ఊపు ఊపిన 'కలైవానర్' ఎన్.ఎస్.కృష్ణన్ విగ్రహం విషయంలో కూడా ఎన్నో స్థల మార్పులు జరిగాయి.

చెప్పాలంటే నాగయ్య, శివరావుగార్ల వంటి దుర్భర జీవితాన్ని గడిపిన, గడుపుతున్న కళాకారులెందరో చిత్రసీమలో కనిపిస్తారు.

కొంతమంది నటీనటుల దుర్భర జీవితానికి కారణం కాలమా? స్వయంకృతాపరాధమా? ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. సినీమాలోకంలో  ఉఛ్ఛస్థితిలో వుంటూ, వరస విజయాలతో  ప్రజలలో గ్లామర్, పాప్యులారిటీ వున్నంతవరకే  నటులకైనా, నటీమణులకైనా, మరే ఇతర సాంకేతికనిపుణులకైనా  రాచమర్యాద.  ఆహా! ఓహో! అంటూ భజనదాసులు చుట్టూ చేరుతారు. ఆ దశ కాస్తా దాటితే ఆ వ్యక్తి ఎంతటి ప్రతిభావంతుడైనా ఎవరూ కన్నెత్తి చూడరు. ఆపదలో ఆదుకోవడం మాట ఎలావున్నా పలకరించను కూడా పలకరించరు. ఇందుకు ఎవరూ అతీతులు కారు. అదే సినీమా లోకం. 

సినీమా పరిశ్రమ అంటారు, కానీ, ఆ మాట తప్పని నా ఉద్దేశ్యం.

ఈనాటి సినీమా నిర్మాణ స్థితిగతుల గురించి నాకేమీ తెలియదు. కానీ, 1970లకు ముందువరకు దక్షిణాది సినీమా పూర్తిగా unorganized sector గానే వుండేది. డబ్బున్న నిర్మాతల మాటే శాసనం. పొగాకు, మిరపకాయల వ్యాపారం మీద వచ్చిన లాభాలతో సినీమా వ్యామోహంతో సినీమాలు తీద్దామని వచ్చే నిర్మాతలు కొంతమంది. ఉన్న  డబ్బు కాస్తా రెండు రీళ్ళతోనే ఖర్చయిపోగా, భార్య పేరునున్న పొలమేదో కూడా అమ్మేసి సగం సినీమా తీసి తర్వాతి సినిమాకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తోచక సమయానికి డిస్ట్రిబ్యూటర్ లు దొరకక ఫైనాన్షియర్స్ చేతుల్లోబడి అష్టకష్టాలుపడి సినీమా పూర్తయిందనిపించేవారే ఎక్కువమంది వుండేవారు. ఇక సినీమా రిలీజ్ అయ్యాక జయపజయాలు నిర్ణయించేది A,B,C సెంటర్ ప్రేక్షకులే. వారు ఎప్పుడు, ఎందుకు, ఏది నచ్చుతారో అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది. రిలీజైన కొన్ని సినీమాలు బాగున్నా, బాగున్నాయని టాక్ వచ్చినా కలెక్షన్ షీట్స్ మాత్రం డల్ అని నిల్ చూపించి నిర్మాతకు ఒట్టి చేతులు చూపేవారు. ఈ రకమైన లాలూచీ థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ల ప్రతినిథులు చాకచక్యంగా పనిచేసి డైలీ కలెక్షన్ రిపోర్ట్ లను నిల్ గా చూపేవారూ ఉన్నారు. ఘంటసాల మాస్టారి 'భక్త రఘునాధ్' మరీ ప్లాప్ కాదు. కొన్ని సెంటర్స్ లో నాలుగైదు వారాలాడింది. అయితే కొన్ని సెంటర్స్ నుండి వచ్చే డైలీ కలెక్షన్ రిపోర్ట్ లో 'rain effected no show' అనో లేక 'no audience, Second show cancelled' అని రిపోర్ట్స్ వచ్చేవి. అయితే అవన్నీ అన్నివేళలా కరెక్ట్ కాదని తేలేది. ఎవరినీ ఏమీ అనలేని, చేయలేని పరిస్థితి చిన్న నిర్మాతలది. ఈ పరిస్థితిలో వారు చాలామంది చిన్న నటులకు, సాంకేతిక నిపుణులకు బకాయి పెడుతూంటారు. ఇవ్వవలసిన చాలా చిన్న మొత్తానికి కూడా ఇవేళా, రేపూ అంటూ తమ ఆఫీసుల చుట్టు తిప్పించుకొని చివరకు ఒక చెక్ ఇస్తారు. బ్యాంక్ లో బేలన్స్ వుండదు. చెక్ బౌన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని నిర్మాత ఆఫీసుకు పరుగుపెడతారు. నిర్మాత ఎప్పుడూ చిన్న చిన్న వాళ్ళకు కనపడడు. ఆఫీస్ మేనేజర్ వుంటాడు. అన్ని రకాలవారిని మేనేజ్ చేయగలవాడే మేనేజర్ . ఏదో చెప్పి మరల చెక్ ప్రజంట్ చేయమని బుజ్జగించి పంపేస్తారు. ఇలా రెండుమూడుసార్లు చెక్ బౌన్సయాక ఒక శుభ ముహుర్తాన చెక్ పేమెంట్ కు బదులు క్యాష్ ఇచ్చి పంపుతారు. అలా ఏ పేమెంట్ ఇవ్వని కేస్ లు చాలానే వుంటాయి.  నేను ముందు చెప్పిన చాలా మంది చిన్న నటులు తమ బకాయిలు వసూలు చేసుకోవడానికి కాలినడకన, సైకిళ్ళ మీద వెడుతూ ఎదురు పడేవారు. రావలసిన డబ్బులు చేతిలో పడిన రోజు వారికి పండగే. ఇవన్నీ మా నాన్నగారికీ అనుభవైకవేద్యమే. తగినంత ఆదాయం లేకపోయినా, అవసరం లేకపోయినా తప్పనిసరిగా బ్యాంకు ఎక్కౌంట్ తెరవవలసి వచ్చేది. 

మా నాన్నగారి బ్యాంక్ ఎక్కౌంట్ మొదట్లో పాండీబజార్ బరోడా బ్యాంక్ లో వుండేది. ఒకటి రెండుసార్లు చెక్ వేయడానికో, డబ్బులు తీయడానికో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఏదో చలాన్ రాసిచ్చారు. అదెందుకో, ఎలా రాయాలో నాకు తెలిసేది కాదు. (ఇది నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లో ఫస్ట్ డేనే నన్ను మహా ఇరకాటంలో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ వివరాలు మరోసారి). బరోడా బ్యాంకులో కొందరు తెలుగువారుండేవారు. ఈ బ్యాంక్ పాండీబజార్ లో ఇప్పుడు పోలిస్ స్టేషన్ కు పక్కన రెండో బిల్డింగ్ లో వుండేది. ఈ రెండింటికి మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉండేది. పాండీబజార్ కి వెళ్ళే దారిలో పనగల్ పార్క్ కి ఉత్తరం వేపు ప్రకాశం రోడ్ మీద, శారద విద్యాలయా ఎదురుగా మూలమీద బర్మా షెల్ పెట్రాల్ బంక్ పక్కన ఇండియన్ బ్యాంక్ ఉండేది. బరోడా బ్యాంక్ కు ఎదురుగా బ్రదర్స్ డయరీ Dr.గాలి బాలసుందర్రావుగారి ఇంటి పక్కన ఆంధ్రా బ్యాంక్ ఉండేది. అందులో పనిచేసే విశ్వనాధంగారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. నాకు కొన్ని రోజుల ట్యూషన్ మాస్టర్.

పాండీబజార్ ఆంధ్రా బ్యాంక్ పక్కనుండి వెళుతున్నప్పుడల్లా ఒక భయంకర సంఘటన గుర్తుకు వచ్చి ఒడలంతా కంపిస్తుంది.

'శ్రీ రామాంజనేయ యుధ్ధం' సినిమా మీకు గుర్తుండే వుండాలి. బాపు, ఎన్.టి.ఆర్, బి.సరోజాదేవిల రంగుల సినీమాకాదు. 1958ల నాటి తెలుపు నలుపు సినీమా. ఆ సినీమాయే ప్రముఖ నటి చంద్రకళకు మొదటి తెలుగు సినీమా. అప్పటికి చాలా చిన్నపిల్ల. యయాతి మహారాజు కుమార్తెగా ఒక భక్తి నృత్యగీతంలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి. ఎమ్.ఎస్.నాయక్ గారి కూతురు. నాయక్ గారు ఆ రోజుల్లో పేరుమోసిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్. కృష్ణా పిక్చర్స్ అధినేత. ఘంటసాలవారి సొంత సినీమాలకు కృష్ణా పిక్చర్స్ వారే పంపిణీదారులు. ఈ 'శ్రీరామాంజనేయ యుధ్ధం' లో ఘంటసాల మాస్టారు పాడిన పద్యాలు చాలా పాప్యులర్ అయాయి. ఈ నాటికీ అందులోని "శ్రీ రఘురామచంద్ర మది చింతన" అనే పద్యం వినవస్తూంటుంది. ఈ సినీమాలో అమర్నాథ్ రాముడు. జూ.శ్రీరంజని సీత. సూర్యనారాయణ లక్ష్మణుడు. రాజనాల ఆంజనేయుడు. మిక్కిలినేని యయాతి మహారాజు. 

లక్ష్మణుడు వేషం వేసిన సూర్యనారాయణ ఆంధ్రా బ్యాంక్ పాండీబజార్ బ్రాంచ్ లో క్యాషియర్. తెలుగువాడు. సినీమాలలో నటించాలనే కాంక్షతో చిన్నా చితకా వేషాలు వేసేవారు. జోగీందర్, విజయకుమార్ అనే ఇద్దరు సూర్యనారాయణకు మంచి స్నేహితులు.

ఒకరోజు ఉదయం సూర్యనారాయణ ఎప్పటిలాగే బ్యాంక్ లావాదేవీలకోసం రిజర్వ్ బ్యాంక్ నుండి కొన్ని లక్షలమొత్తం డ్రా చేసి బయటకు వచ్చిన ఆయన్ని విజయకుమార్, జోగీందర్ లు ఆపి మాట్లాడుతూ దారి మధ్యలో ఎక్కడో ఆ డబ్బు లాక్కునే ప్రయత్నంలో వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఆ ఇద్దరూ సూర్యనారాయణను ఆ ఘోరంగా చంపేసినట్టు పత్రికల్లో వచ్చింది.  పట్టపగటిపూట ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక, కారులో శవంతో సాయంత్రం దాకా ఊరంతా తిరుగుతూ చీకటిపడే సమయానికి చెంగల్పట్ వెళ్ళే దారిలో అక్కడవున్న పెద్ద చెఱువులోనో, నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలోనో  శవాన్ని విసిరేసి డబ్బుతో అక్కడనుండి పారిపోయారని తెలిసింది. 

రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళిన సూర్యనారాయణ ఎంతకీ బ్యాంకుకు తిరిగిరాకపోవడం, తన ఇంటికీ చేరకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చెంగల్పట్టు దగ్గర దొరికిన శవం సూర్యనారాయణదిగా పోలీసులు గర్తించి,  హత్యగా నిర్ధారించి హంతకుల కోసం వేట మొదలెట్టారు. కొంతకాలానికి అసలు హంతకులు జోగిందర్, విజయకుమార్ లేనని తేల్చి వారిని అరెస్ట్ చేసారు. చాలా నెలలు ఈ కేసు హైకోర్టులో విచారణ జరిపిన తరువాత నిందితులైన విజయకుమార్, జోగీందర్ లకు ఉరిశిక్ష వేశారు. కోర్టులో ఆ కేస్ విచారణ జరుగుతున్నంతకాలం తెలుగు, తమిళ, ఇంగ్లీషు దినపత్రికలలో వివరాలన్నీ ధారావాహికగా ప్రచురించారు. ఈ ఆంధ్రా బ్యాంక్ హత్య ఆనాటికి యువకులుగా ఉన్నవారికి, మద్రాసులో ఉన్నవారికి గుర్తుండే అవకాశం వుంది. పాండీబజార్ ఆంధ్రాబ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, బీచ్ రోడ్, చెంగల్పట్ చెరువు చూసినప్పుడల్లా నాకు ఈ భయంకర సంఘటన గుర్తొస్తూంటుంది. 

1962లో ప్రారంభమై 1963లో విడుదలైన సినీమాలన్నీ ఘంటసాల వారి గాన ప్రతిభకు పట్టం గట్టినవే. వారి కీర్తి కిరీటంలో కలికితురాయిలెన్నో. 1963లో కూడా ఎన్.టి.ఆర్ హవా బాగానే వీచింది. ఎ.ఎన్.ఆర్ తో నటించిన శ్రీకృష్ణార్జునయుధ్ధం, పెంపుడుకూతురు, వాల్మీకి, సవతికొడుకు, లవకుశ, పరువు ప్రతిష్ట, ఆప్తమిత్రులు,  బందిపోటు, లక్షాధికారి తిరుపతమ్మ కథ, నర్తనశాల, మంచి చెడులాంటి 12 సినీమాలతో ముందంజలో ఉన్నారు. అక్కినేని వారివి నాలుగు మాత్రమే. అందులో ఒకటి డబ్బింగ్ - శ్రీకృష్ణార్జునయుధ్ధం, చదువుకున్న అమ్మాయిలు, పునర్జన్మ, నిరపరాధి. జగ్గయ్య ఈడూజోడూ, కాంతారావు తోబుట్టువులు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలయ్యాయి. ఈ సినీమాలలో ఘంటసాలగారు పాడిన పాటలన్నీ ఆపాతమధురాలుగా ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి.

1945 నుండి 1974 వరకు ఏ రకమైన పోటీకి సాటిలేని గాయకుడు ఘంటసాల మాస్టారేనని పదేపదే నొక్కివక్కాణించ పనిలేదు. గాయకుడిగా వారిదే అగ్రస్థానం. మకుటంలేని మహారాజు. 

1963లో ఘంటసాలగారు సంగీత దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు వాల్మీకి, లవకుశ, ఆప్తమిత్రులు, బందిపోటు. ఈ సినీమాలలోని సంగీతం చిరస్థాయిగా మిగిలిపోతుందున్న విషయంలో ఎవరికీ ఏ సందేహము అవసరంలేదు.

ఈ నాలుగు సినీమాల విశేషాలు వచ్చే సంచికలో...
   
                  ...సశేషం